ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం బయో సైన్స్ మూవీ ది వ్యాక్సిన్ వార్. ఈ చిత్ర ప్రీమియర్స్ కి హాజరైన సుధామూర్తి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధ మూర్తి తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాప్యులర్ అయ్యారు. ఆమె రచయిత, మోటివేషనల్ స్పీకర్ కూడాను. హ్యూమర్ కగలిపి ఆమె చెప్పే జీవిత సత్యాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తాయి. కోట్లు ఉన్నా సాధారణ జీవితాన్ని ఇష్టపడే ఆమె సింప్లిసిటీ అభిమానులను తెచ్చిపెట్టింది. కాగా సుధ మూర్తి ది వ్యాక్సిన్ వార్ చిత్ర ప్రీమియర్స్ కి హాజరయ్యారు. అనంతరం సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుధ మూర్తి మాట్లాడుతూ... ''మహిళగా నేను సాటి మహిళలను అర్థం చేసుకోగలను. మహిళ తన కెరీర్ లో ముందు వెళుతూ భార్య, తల్లి బాధ్యతలు కూడా నెరవేర్చాలి. కుటుంబాన్ని వృత్తిని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడిన వ్యవహారం. ఈ విషయంలో కొందరు మాత్రం అదృష్టవంతులు. పిల్లల్ని చూసుకుంటూ కెరీర్ లో సక్సెస్ కావడం అంత సులభం కాదు. కుటుంబ మద్దతు ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ మహిళ వెనుక అర్థం చేసుకునే మగవాడు ఉంటాడు.
ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో చిన్న పిల్లలు తమ తల్లుల సక్సెస్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు. సాధారణ జనాలకు ఈ కోవ్యాక్సిన్ అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆ వ్యాక్సిన్ పొందడానికి సైంటిస్ట్స్ పడ్డ కష్టాన్ని ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం కష్టం కాదు, నిస్వార్ధంతో కూడిన హార్డ్ వర్క్. సైంటిస్ట్స్ నెలల తరబడి లాబొరేటరేటరీలలో గడిపారు. దాని ఫలితమే ఆరోగ్యకరమైన డెమొక్రటిక్ కంట్రీ. మనం హ్యాపీగా ఉన్నాము. అటువంటి మంచి సందేశం ఈ చిత్రంలో ఉంది.
మనకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మన మీద మనకు నమ్మకం ఉండదు. మనం తలచుకుంటే చేయగలం. ఈ చిత్ర సందేశం అదే. ఒక వైద్య రంగంలోనే కాదు ప్రతి రంగంలో మనం గొప్ప విజయాలు సాధించగలం. అందం అనేది బట్టలు, మేకప్ లో లేదు. విశ్వాసం, ధైర్యం లో ఉంది. ఈ చిత్రం అదే తెలియజేస్తుంది. భారతీయులందరూ తమ సామర్థ్యాలను బయటకు తీయాలి. కష్టపడుతూ ఉండండి. గర్వపడే భారతీయులుగా మనం ఉంటాము..'' అన్నారు.
2020-21 సంవత్సరాల్లో ప్రపంచం కోవిడ్ కారణంగా గత వందేళ్లలో ఎన్నడూ చూడని భయానక పరిస్థితులు చూసింది. ముఖ్యంగా 130 కోట్ల భారతీయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్షల మంది భారతీయులు కరోనా కారణంగా మరణించారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఇండియన్ సైంటిస్ట్స్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం పడిన శ్రమ, సైంటిస్ట్స్ కి ఎదురైన సవాళ్ళను వాస్తవ సంఘటనలకు దగ్గరగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించాడు. నానా పటేకర్ ప్రధాన పాత్ర చేశారు. సెప్టెంబర్ 28న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు.