సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు, మరింత ఘాటుగా వార్నింగ్... పోలీసులకు బాలీవుడ్ హీరో ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరో..కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల పర్వం ఆగలేదు. ఆయన టార్గెట్ గా భారీకుట్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్స్ నుంచి సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి ఈమెయిల్ ద్వారా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు ఘాటుగా బెదరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో.. ఒక్క సారిగా ఉలిక్కిపడిన సల్మాన్ టీమ్ వెంటనే దీనిపై ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.మెయిల్ బెదిరింపులపై గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్లపై ముంబై పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు చాలా సార్లు.. చాలా రకాలుగా బెదిరింపులు వచ్చాయి. ఒకసారి సల్మాన్ హత్యకు కూడా ప్రయత్నించారు బిష్ణోయ్ గ్యాంగ్.
ఇక ఈసారి బెదిరింపుల్లో.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్తో మాట్లాడాలనుకుంటున్నాడని మెయిల్ సందేశం పంపించినట్టు..పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సల్మాన్ టీమ్ పేర్కొన్నారు. అంతే కాదు సల్మాన్ ఖాన్ను చంపడమే తన జీవిత లక్ష్యమని మెయిన్ లో వారు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ఖాన్కు బెదిరింపులు రావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ఖాన్ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషి అని తీర్పు వచ్చిది.
కోర్టు నిర్ధోషిగా సల్మాన్ ను ప్రకటించానా.. బిష్ణోయ్ తెగ నుంచి మాత్రం తిప్పలు తప్పడం లేదు సల్మాన్ ఖాన్ కు. బాలీవుడ్ స్టార్ హీరోను వారు శత్రువులా చూడటం స్టార్ట్ చేశారు. కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగవారికి ఆరాధ్య దైవం. ఈ విషయంలో సల్మాన్ పై వారు పట్టరాని కోపంగా ఉన్నారు. కృష్ణ జింకలను కులదైవంగా పూజించే బిష్ణోయ్ తెగ ప్రజలు సల్మాన్పై మండిపడుతున్నారు. అంతే కాదు రీసెంట్ గా సల్మాన్పై ఈ తెగకు సబంధించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గతేడాది పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య ధారణంగా జరిగింది. ఈ హత్య తామే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అయితే ఈ హత్య తరువాతే సల్మాన్కు బెదిరింపు లేఖ వచ్చింది.
ఈ మధ్య ఒక టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పై మరోసారి బెదిరింపులకు దిగాడు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ మీద తమవారంతా కోపంతో ఉన్నారని .. అతను తమను తమ దైవాన్ని అవమానించాడని.. అందుకే అతనిపై అంతా తీవ్ర ఆగ్రహం ఉన్నారని తెలిపారు లారెన్స్ బిష్ణోయ్. అంతే కాదు సల్మాన్ను జోధ్పూర్లోనే చంపుతానని లైవ్ లో వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక సల్మాన్ ను వదిలిపెట్టాలి అంటే.. అతను తమ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని.. తమ వారికి క్షమాపణ చెబితే వదిలేస్తామని లారెన్స్ బిష్ణోయ్ స్పష్టం చేశాడు.
సల్మాన్ ఖాన్ కు మొదటి బెదిరింపు వచ్చిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ సెక్యూరిటీని పెంచింది. ఇప్పటికీ సాయుధ గార్డ్లు సల్మాన్ వెంటే ఉంటూ.. భద్రత కల్పిస్తున్నారు. ఈక్రమంలో మరోసారి కొందరు వ్యక్తులు సల్మాన్ ఖాన్తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్ను కూడా చంపేస్తామంటూ.. మరోసారి లేఖ పంపారు. దాంతో ఈసారి సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇప్పుడు మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో.. పోలీసులు ఏం చర్య తీసుకుంటారా అనేది.. ఉత్కంఠగా మారింది. అటు సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకు ఏమౌతుందా అని.. ఆందోళనలో ఉన్నారు. సల్మాన్ కు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతున్నారు.