Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీపై రాళ్ల దాడి..  ఎక్క‌డ జ‌రిగిందంటే..? 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీపై  రాళ్ల దాడి జరిగింది. ఆయ‌న త‌న నూత‌న చిత్రం షూటింగ్‌ను ముగించుకుని.. స‌హా నటుల‌తో పహల్గామ్ మార్కెట్‌లో షికారు చేయడానికి బయలుదేరారు. ఈ స‌మ‌యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. 

Stone pelting on crew of Imran Hashmi in Pahalgam, police registers FIR
Author
First Published Sep 19, 2022, 10:52 PM IST

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీపై దాడి జ‌రిగింది. జ‌మ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న కొత్త సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరుగుతోంది. సోమ‌వారం నాడు ఆయ‌న త‌న‌ షూటింగ్‌ ముగించుకుని.. త‌న స‌హచ‌రుల‌తో స‌రదాగా న‌గరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతు షాపింగ్ చేయ‌డానికి వ‌చ్చారు.

ఈ స‌మ‌యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే రాళ్లు రువ్విన దుండగులపై 147, 148, 370, 336, 323 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మీడియా కథనాల ప్రకారం.. గ‌త కొన్నిరోజులుగా.. ఇమ్రాన్ హష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న గ్రౌండ్ జీరో చిత్ర షూటింగ్ జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ లో జ‌రుగుతోంది.  దీంతో ఇమ్రాన్ హష్మీ గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో ఉన్నారు. తన కొత్త సినిమా 'గ్రౌండ్ జీరో' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి తేజస్ డియోస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

ప్రతిసారీ లాగానే ఈసారి కూడా ఈ సినిమా ద్వారా నటీనటులు తమ అభిమానులకు కొన్ని పెద్ద సర్‌ప్రైజ్‌లను అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ సరసన కథానాయికగా నటిస్తోందని గతంలో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. 

ఇమ్రాన్ హష్మీ ఆర్మీ డ్రామాలో సాయి తమంకర్ ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించబోతుంద‌ట‌.  నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో జోయా హుస్సేన్ కూడా క‌నిపించ‌బోతుంద‌ట‌. ఈ సినిమాలో సాయి తమంకర్, ఇమ్రాన్‌ల కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండ‌బోతుందోన‌ని 
ప్రేక్షకులను ఎంతగానో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.  

ప్ర‌స్తుతం ఇమ్రాన్ హ‌ష్మీ  'గ్రౌండ్ జీరో' కాకుండా.. ప‌లుఇతర ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తున్నారు. బీటౌన్ టాక్ ప్ర‌కారం.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంట‌గా న‌టిస్తున్న‌ టైగర్ 3 లో ఓ కీల‌కమైన‌ పాత్రలో కనిపించనున్నాడు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ఇది కాకుండా.. అక్షయ్ కుమార్‌తో కలిసి సెల్ఫీ చిత్రంలో కూడా ఇమ్రాన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న‌ట్టు బాలీవుడ్ టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios