స్టార్ హీరో అజిత్ వైఫ్ షాలిని రీ ఎంట్రీ!
పొన్నియన్ సెల్వన్ మూవీలో షాలిని ఓ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ భారీ చిత్రంలో షాలిని రోల్ ఏమిటనేది ఇంకా స్పష్టత లేదు.
అజిత్ కుమార్ వాలిమై గా త్వరలో థియేటర్స్ లో దిగనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. అజిత్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ పండగ చేసుకున్నారు. కాగా అజిత్ వైఫ్ షాలిని సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.
మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, విక్రమ్, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, జయం రవి వంటి భారీ తారాగణంతో పొన్నియన్ సెల్వన్ మూవీ తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ పీరియాడిక్ మూవీ మొదటి పార్ట్ సమ్మర్ కానుకగా 2022లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
కాగా పొన్నియన్ సెల్వన్ మూవీలో షాలిని ఓ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ భారీ చిత్రంలో షాలిని రోల్ ఏమిటనేది ఇంకా స్పష్టత లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1983లో కెరీర్ ప్రారంభించిన షాలిని తెలుగులో జైలు పక్షి, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలలో నటించారు. మలయాళ, తమిళ భాషల్లో ఆమె పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.
1997లో విడుదలైన అనియాతి పర్వు అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారారు. 1999లో విడుదలైన అమర్ కాలమ్ మూవీలో అజిత్ కి జంటగా నటించిన షాలిని అతనితో ప్రేమలో పడ్డారు. 2000లో అజిత్, షాలిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు సంతానం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి మూవీ ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది.