Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌ ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌.. టైటిల్‌ మాత్రమే కాదు.. మాస్‌ స్ట్రైక్‌ కూడా..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `ఎస్‌ఎస్‌ఎంబీ28`.(వర్కింగ్‌ టైటిల్‌). తివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ రాబోతుంది. 

ssmb28 team one more treat plan for maheshbabu fans arj
Author
First Published May 27, 2023, 9:47 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా ఇప్పుడు `ఎస్‌ఎస్‌ఎంబీ28` అనే చిత్రం రూపొందుతుంది. త్రివిక్రమ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా త్రివిక్రమ్‌ అంటే క్లాస్‌ లుక్‌కి కేరాఫ్‌. కానీ ఆయన ఈ సారి రూట్‌ మార్చి ఊరమాస్‌ లుక్‌ని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయింది. ఇందులో మహేష్‌ని మాస్‌ కా బాప్‌ అనేలా చూపించబోతున్నారని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్‌ ఫ్యాన్స్ కి టైమ్‌ వచ్చింది. వాళ్లు పండగ చేసుకునే టైమ్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్స్ రాబోతున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న మహేష్‌-త్రివిక్రమ్‌ ల సినిమా టైటిల్‌ ని రివీల్‌ చేస్తామని వెల్లడించింది. తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. అదే రోజు `మాస్‌ స్ట్రైక్‌` పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ తరహాలోనే  ఓ థండర్‌ లాంటి వీడియోని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇది యాక్షన్‌ సన్నివేశాలతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటుందని సమాచారం.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా మరో కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. మహేష్‌ బ్యాక్‌ సైడ్‌ నుంచి ఉన్న కొత్త లుక్‌ ఇది. తలకు రెడ్‌ టవల్‌ కట్టుకుని, చేతితో సిగరేట్‌ తాగుతూ, చెక్స్ షర్ట్ లో, రగ్గుడ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో మహేష్‌ లుక్‌ ఊరమాస్‌గా ఉండటం విశేషం. ఇది ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈసినిమాకి సంబంధించి ఓ క్రేజీ పనిచేయబోతుంది యూనిట్‌. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా టైటిల్‌ని ఏకంగా ఫ్యాన్స్ చేతనే రివీల్‌ చేయించబోతుంది. థియేటర్లలోనే ఈ సినిమా టైటిల్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. అది ఫ్యాన్స్ తోనే చేయించాలని ప్లాన్‌ చేశారు. అయితే ఇది సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎవర్‌ గ్రీన్‌ మూవీ `మోసగాళ్లకి మోసగాడు` మూవీ  ప్రదర్శించే థియేటర్లలో కావడం విశేషం. కృష్ణ జయంతి సందర్భంగా `మోసగాళ్లకి మోసగాడు` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్న విసయం తెలిసిందే. దాంతోపాటు `ఎస్‌ఎస్‌ఎంబీ28` టైటిల్‌ని రిలీజ్‌ చేయనున్నారని చెప్పొచ్చు. ఓ రకంగా ఇది అరుదైన విషయమనే చెప్పాలి. 

ఇక మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంలో పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. జాన్‌ అబ్రహం నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు తీసిన ఫూటేజ్‌ మహేష్‌కి నచ్చలేదట. సరిగా తీయడం లేదని మహేష్‌ కంప్లెయింట్‌ చేస్తున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్లు, మామూలు సన్నివేశాలతో సహా అన్నింటి విషయంలో మహేష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌ విషయంలోనూ అసంతృప్తిగా ఉన్నారట. త్రివిక్రమ్‌కి, మహేష్‌కి పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే షూటింగ్‌ ఆగిపోయిందని అంటున్నారు. అయితే మళ్లీ జూన్‌ మొదటి వారం నుంచి షూటింగ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. మరి ఇప్పుడైనా సాఫీగా సాగుతుందా? లేక మళ్లీ మహేష్‌ అభ్యంతరం తెలియజేస్తాడా? అనేది చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios