విల్లే పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర
- విల్లా పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయం
- మరి కాసేపట్లో అంత్య క్రియలు
- అంత్య క్రియలకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
నుదుట సింధూరం, కళ్లకు కాటుక, పెదాలకు తాంబూలాన్ని మించిన ఎర్రటి లిప్ స్టిక్, మెడలో బంగారు లక్ష్మీదేవి హారం.. అతిలోక సుందరి శ్రీదేవి బతికున్నప్పుడు ఎంత అందగా ముస్తాబయ్యేదో.. అంతే అందంగా తన భౌతిక కాయాన్ని అలంకరించి కడసారి వీడ్కోలుకు ముస్తాబు చేశారు కుటుంబ సభ్యులు.
రాత్రి ఇంటికి చేరుకున్న శ్రీదేవిని కడసారి చూపు చూసుకున్న కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్, ఇతర కుటుంబసభ్యులు అందంగా ముస్తాబు చేశారు. సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో సందర్శకుల కోసం వుంచి ఆ తర్వాత తెల్లని పూలతో అందంగా అలంకరించిన వాహనంలో... అంతిమయాత్రకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్ర ప్రారంభించారు. తెల్లరంగు మల్లెలను అంతిమయాత్ర రథం విలా పార్లే హిందూ హిందూ స్మశానవాటికకు చేరుకుంది. మరి కాసేపట్లో.. అంత్య క్రియలు నిర్వహించనున్నారు.