శ్రీముఖి ఇంట విషాదం.. యాంకర్ ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర యాంకర్, నటి శ్రీముఖి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె అమ్మమ్మ సోమవారం కన్నుమూశారు. దీంతో శ్రీముఖి ఓ ఎమోషనల్ పోస్ట్ ని అభిమానులతో పంచుకుంది.
యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీముఖి అమ్మమ్మ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఎమోషనల్ నోట్ని పంచుకుంది. అమ్మమ్మతో ఉన్న ఫోటోని పంచుకుంటూ `అమ్మమ్మ అంటే నాకిష్టం. జీవితంలో చాలా విషయాలను నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది.
ఎల్లప్పుడు సంతోషాన్ని అందరికి పంచేది.ఆమె చాలా ధైర్యవంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ` అని ఎమోషనల్ నోట్ని షేర్ చేసింది శ్రీముఖి. దీంతో శ్రీముఖి అమ్మమ్మకి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.
ఇక శ్రీముఖి యాంకర్గా రాణిస్తుంది. తెలుగు యాంకర్స్ లో టాప్లో ఒకరిగా రాణిస్తుంది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయ్యింది. జీ తెలుగు, స్టార్ మా స్పెషల్ ఈవెంట్లకి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ శ్రీముఖి కావడం విశేషం. అయితే రెగ్యూలర్గా ఆమె చేతిలో ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇటీవల ఆమె మెయిన్ లీడ్గా `క్రేజీ అంకుల్స్` చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ని దక్కించుకోలేకపోయింది.