ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం!
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి శకుంతలమ్మ(89) నెల్లూరులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం 7 గంటలకుమరణించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యంలండన్ లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియడంతో ఆయన అక్కడ నుండి బయలుదేరారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.