సోనూ సూద్‌ చేస్తున్న సేవలను గుర్తించిన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌.. నటుడు సోనూసూద్‌కి సోషల్‌ వెల్ఫేర్‌ అవార్డుని ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సోనూసూద్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

రియల్‌ హీరోగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌ని పంజాబ్‌ ప్రభుత్వం గౌరవించింది. అరుదైన అవార్డుని ప్రకటించింది. సోనూ సూద్‌ చేస్తున్న సేవలను గుర్తించిన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌.. నటుడు సోనూసూద్‌కి సోషల్‌ వెల్ఫేర్‌ అవార్డుని ఇస్తున్నట్టు ప్రకటించింది. సోనూసూద్‌తోపాటు యంగేస్ట్ సర్చంచ్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ ల్లోకి ఎక్కిన కరణ్‌ గిల్హోత్రాని సైతం అదే అవార్డుతో సత్కరించింది. కరణ్‌ గిల్హోత్రా ఈ అవార్డుని ఆదివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.

Scroll to load tweet…

దీంతో సోనూసూద్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి, వలసకార్మికులకు అండగా నిలిచారు సోనూసూద్‌. వారికి షెల్టర్‌ ఏర్పాటు చేయడంతోపాటు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం సురక్షితంగా వారిని స్వస్థలాలకు ప్రత్యేకంగా బస్సులు, ట్రైన్ల ద్వారా పంపించారు. అనంతరం తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో టైమ్‌లో కరోనా రోగులకు బెడ్స్, ఆక్సిజన్‌ బెడ్స్, వెంటిలేటర్స్ , రెమిడెసివర్స్ ఇంజిక్షన్లు అందిస్తూ తన సేవని మరింతగా విస్తరించారు.

మరోవైపు దేశంలో కొన్ని చోట్ల ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేశారు. అంతేకాదు మున్ముందు ఫ్రీగా వైద్యం, విద్య అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతోపాటు నటుడిగానూ నటిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.