డియర్ సోనూ.... రియల్ హీరో సోనూ సూద్ కు రైల్వే అధికారుల వార్నింగ్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూసూద్ ను సున్నితంగా మందలించింది రైల్వే శాఖ. ఆదర్శంగా నిలవాల్సిన మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నది. ఇంతకీ ఏ విషయంలో ఈ వాఖ్యలు చేసింది.
బాలీవుడ్ స్టార్ .. రీల్ విలన్.. రియల్ హీరో సోనూసూద్కు రైల్వే అధికారులు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్ గా ఆయన చేసిన పనికి ఈ విమర్షలు ఎదుర్కొక తప్పలేదు. రీసెంట్ గా సోనూసూద్ పోస్ట్ చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణమైంది. డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ కనిపించారు. రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. హ్యాండ్రైల్ పట్టుకుని రైలు నుంచి బయటకు చూస్తూ ప్రయాణం చేస్తూ.. కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. చేతికి ఎముకలేదన్నంతగా దానాలు చేస్తూ.. రీసెంట్ గా కూడా ఓ వృద్థ కళాకారుడిని ఆదుకుని మరో సారి మంచి మరసు చాటుకున్నాడు. అటువంటిది.. చాలా మంది జనాలు దేవుడిగా భావించే సోనూసూద్.. నలుగురికి ఆదర్శంగా మారాడు. అటువంటిది ఇలాంటి పనులు చేస్తే.. ఆయన్ను కూడా చాలా మంది ఫాలో అయ్యే అవకాశం ఉంది. సోనూ చేసిన ఈపనిపై విరుచుకుపడ్డారు. నెటిజన్లు. ఘాటుగా విమర్షలు చేస్తూ.. వరుసగా ట్రోల్ చేశారు.
ఇక ఈ ఘటనపై రైల్వే అధికారులు కాస్త లేట్ గా స్పందించారు. సోనూ సూద్ ని సున్నితంగా హెచ్చరించారు. ట్రైన్ లో ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. వారు ఏమన్నారంటే..? డియర్ సోనూ సూద్. మీరు ఎంతో మందికి రోల్ మోడల్. ఇలా రైలు మెట్లపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వీడియోలతో మీ అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి. రైలు ద్వారా సున్నితమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి అంటూ రౌల్వే శాఖ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకుని.. తన వంతు గా చాలామందికి సహాయం చేశాడు సోనూ సూద్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ , రియల్ హీరో సోనూసూద్.. తన సంసాదనలో చాలా వరకూ.. ఇలా సాయం చేయడానకి ఉపయోగించాడు. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్ చేశారు. అయితే, తాజాగా సోనూ సూద్ చేసిన ఓ పనికి మాత్రం నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.