Asianet News TeluguAsianet News Telugu

'కామెడీ ఇరుక్కు.. స్టోరీ ఇరుక్కు' స్టేజీపై దిల్ రాజును ఇమిటేట్ చేసిన నిర్మాత!

కామెడీ ఇరుక్కు(ఉంది), ఫైట్స్ ఇరుక్కు, స్టోరీ ఇరుక్కు, విజయ్ మేనరిజమ్ ఇరుక్కు అంటూ తమిళంలో స్పీచ్ ఇచ్చారు. దాంతో దిల్ రాజు తమిళ్ స్పీచ్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

SKN byte with latest viral superlative at the trailer launch event of #WriterPadmabhushan
Author
First Published Jan 21, 2023, 5:29 PM IST


సెలబ్రెటీలు ప్రతీ విషయం ఆచి,తూచి మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది. ఏమాత్రం తేడాగా మాట్లాడిన సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు. రీసెంట్ గా విజయ్ దళపతి(Vijay Thalapathy) నటించిన వారిసు(వారసుడు) సినిమాను దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి విడుదల చేసారు. ఈ సందర్బంగా తమిళంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొన్నారు. అప్పుడు స్పీచ్ కు సంభందించి.. ఓ పేపర్ మీద కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్నారు. విజయ్ దళపతి గురించి మాట్లాడారు. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. కామెడీ ఇరుక్కు(ఉంది), ఫైట్స్ ఇరుక్కు, స్టోరీ ఇరుక్కు, విజయ్ మేనరిజమ్ ఇరుక్కు అంటూ తమిళంలో స్పీచ్ ఇచ్చారు. దాంతో దిల్ రాజు తమిళ్ స్పీచ్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొన్నిరోజుల పాటు ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు కలిపి మాట్లాడారు దిల్ రాజు. దీని మీద విపరీతంగా మీమ్స్ క్రియేట్ చేశారు.

ఇప్పుడు  అదే స్పీచ్ ను మరో ప్రొడ్యూసర్ ఓ సినిమా ఫంక్షన్ లో ఇమిటేట్ చేశారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్(writer padmabhushan) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్(SKN) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీచ్ ఇచ్చారు. తమిళంలో దిల్ రాజు ఇచ్చిన స్పీచ్ లాగానే మాట్లాడారు. దీంతో మళ్లీ ట్రోల్స్ మెుదలయ్యాయి. అచ్చం దిల్ రాజులాగానే ఎస్కేఎన్ మాట్లాడారు. దీని మీద చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్(శ్రీనివాస్ కుమార్) పాల్గొన్నాడు. స్పీచ్ ఇస్తూ లాస్ట్ లో కొన్ని రాసుకొచ్చానని, మొబైల్ తీసి చూశాడు. అప్పటికే అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో కామెడీ ఇరుక్కు, స్టొరీ ఇరుక్కు అంటూ మాట్లాడారు. దిల్ రాజు(Dil Raju) తరహాలోనే తెలుగు సినిమా ఫంక్షన్ లో ఎస్కేఎన్ తమిళ్ లో మాట్లాడుతూ.. ఇరుక్కు.. ఇరుక్కు అనడంతో ఈవెంట్లో ఫన్నీగా అందరూ నవ్వారు. ఇప్పుడు ఎస్కేఎన్ స్పీచ్ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

 'రైటర్ పద్మభూషణ్'  సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలచుట్టూ తిరిగే అంశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగుతారుగానీ, ఫ్రీగా ఇచ్చే పుస్తకం మాత్రం చదవరు' .. నా లైఫ్ అనే బుక్ లో పేజీలు తక్కువే ఉంటాయిగానీ కేరక్టర్లు .. ట్విస్టులు బాగానే ఉంటాయి" అనే డైలాగులు పట్టుకుంటాయి.  సుహాస్ తండ్రి పాత్రలో ఆశిష్ విద్యార్ధి .. తల్లి పాత్రలో రోహిణి కనిపిస్తున్నారు. టీనా శిల్పారాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. లహరి ఫిలిమ్స్ - చాయ్ బిస్కట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios