సింగర్ సునీత దానికోసం ఏడాదంతా వెయిట్ చేస్తుందట.. ఆమె కష్టానికి ప్రతి`ఫలం` వచ్చేసినట్టే..
సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత చాలా ఓపెన్ అయ్యింది. తనకు నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఫామ్ కి సంబంధించిన వీడియో పంచుకోగా, వైరల్ అవుతుంది.
సింగర్ సునీత టాలీవుడ్లో స్టార్ సింగర్గా రాణిస్తుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు జోరు తగ్గినా, ఆమె స్థానం పదిలం. ఆమెకి వచ్చే పాటలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ తనదైన మధురమైన గాత్రంతో అలరిస్తూనే ఉంది. అయితే ఎప్పుడు బిజీ లైఫ్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలనేది పాటిస్తుంది సునీత. మానసిక ఆహ్లాదాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. అందుకు ఆమె తన ఫాహ్ హౌజ్ని ఎంచుకోవడం విశేషం.
సింగర్ సునీత పాటల్లో బిజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఎక్కువగా ఫామింగ్కి ప్రయారిటీ ఇస్తుంది. ఆమెకి ఓ ఫామ్ హౌజ్ కూడా ఉంది. అందులో చాలా వరకు ఆర్గానిక్ మెథడ్లో పంటలు పండిస్తుంది. కూరగాయలు, పండ్ల చెట్లు ఉంటాయి. వాటినే చాలా వరకు ఆమె ఉపయోగిస్తుంటుంది. అదే సమయంలో ఏమాత్రం టైమ్ దొరికినా తన ఫామ్ హౌజ్కి వెళ్లిపోతుంది. తనకు వచ్చిన పని చేస్తుంటుంది.
దీనికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకుంటూనే ఉంటుంది సింగర్ సునీత. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో వీడియోని షేర్ చేసింది. ఫేస్ బుక్లో పంచుకున్న వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె మామిడి తోటలో మామిడి కాయలు చూస్తూ మురిసిపోతుంది. చాలా రోజులుగా కష్టపడి ఆమె మామిడి తోట పెంచుతుంది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతి ఫలం వచ్చింది. చెట్టు కాయలు కాస్తుంది.
ఈ సందర్భంగా ఆమె చెబుతూ, పండురా అంటాను. వీటి కోసమే ఏడాది పాటు వెయిట్ చేస్తాను` అని తెలిపింది. మామిడి పండ్లని చూపిస్తూ ఆమె దిగిన వీడియో క్లిప్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల తనకొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేసింది సింగర్ సునీత. `సర్కారు నౌకరీ` అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీన్ని కే రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. ఇక సింగర్ సునీత తన పాటలతో, మ్యూజిక్ కాన్సర్ట్ తో బిజీగా ఉంటుంది.