Singer Sunitha: సునీత వెడ్స్ రామ్.. నేడు మొదటి యానివర్సరీ.. సింగర్ సునీత ఫీలింగ్ ఏంటీ?
2021 జనవరి 9న రామ్-సునీత వివాహం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. సునీత కొడుకు ఆకాష్, శ్రియ ఇద్దరూ దగ్గరుండి ఈ వివాహం జరిపించారు. రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం అందంగా మారిపోయింది.
నిర్ణయాలే జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. భవిష్యత్ వాటి పైనే ఆధారపడి ఉంటుంది. సింగర్ సునీత (Singer Sunitha)లైఫ్ దీనికి బెస్ట్ ఎగ్జామ్ఫుల్. మొదటి భర్తతో విభేదాలు, విడాకులు కారణంగా సునీత మానసిక వేదన అనుభవించారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల కెరీర్, ఫ్యూచర్ కోసం పరితపించారు. ఇద్దరినీ లైఫ్ లో ఎలా సెటిల్ చేయాలని ఆవేదన చెందారు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కుటుంబానికి అన్నీ తానై పోషించారు.
ఈ క్రమంలో ఆమె ఆర్థికంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో మాంగో మీడియా అధినేత రామ్ (Ram).. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. చాలా కాలంగా రామ్ మదిలో ఈ ఆలోచన, ఆశ ఉంది. కానీ పరిచయం ఉన్నప్పటికీ సునీత ఎలా రెస్పాండ్ అవుతారో అనే భయం ఆయన్ను వెంటాడింది. ఓ రోజు ధైర్యం చేసి అడిగేశారు. 2020 చివర్లో సునీత-రామ్ మధ్య అవగాహన కుదిరింది. రామ్ పెళ్లి ప్రపోజల్ ని సునీత కుటుంబ సభ్యులతో డిస్కస్ చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో సునీత పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
సోషల్ మీడియా వేదికగా సునీత తన పెళ్లి వార్త ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే దీనిపై భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు. 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి అవసరమా? అది కూడా పెళ్లీడుకొచ్చిన పిల్లలుండగా... అంటూ విమర్శల దాడి చేశారు. అయితే మెజారిటీ వర్గం ఆమెకు మద్దతుగా నిలిచారు.
2021 జనవరి 9న రామ్-సునీత వివాహం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. సునీత కొడుకు ఆకాష్, శ్రియ ఇద్దరూ దగ్గరుండి ఈ వివాహం జరిపించారు. రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం అందంగా మారిపోయింది. ఈ కొత్త బంధాన్ని ఆమె ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇక నేడు రామ్-సునీతల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ (Wedding Anniversary).
ఈ ప్రత్యేకమైన దినాన సునీత సోషల్ మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర సందేశం పంచుకున్నారు. మనం ఆశలన్నీ వదులుకున్నప్పుడు ప్రేమ వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది. మా ఇద్దరి విషయంలో ఇది జరిగింది. ప్రతి పెళ్ళికి వెనుక ఓ కథ ఉంటుంది. ఇక మా ఈ ప్రయాణంలో ప్రేమ ఉంది.. జాయ్.. అంటూ సునీత పోస్ట్ షేర్ చేశారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సునీత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అదే సమయంలో ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
రామ్ తో వివాహం తర్వాత సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టీవ్ కావడం విశేషం. ఆమె తరచుగా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన విషయాలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.