మానాడు సినిమా రిలీజ్ ముందు శాటిలైట్ హక్కుల విషయంలో సురేష్, ఫైనాన్సియర్ ఉత్తమ్ చాంద్, రాజేందర్ మధ్య చర్చ జరిగింది. శాటిలైట్ హక్కులని తాను 5 కోట్లకు పైనే అమ్మిపెడతానని రాజేందర్ మాట ఇచ్చారు.
తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో Simbu. శింబు నటించిన చిత్రాలు విడుదలవుతుంటే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. అంతటి క్రేజ్ శింబు సొంతం. ఇక శింబు చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. వివాదాల నడుమ, ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో ఇటీవల మానాడు చిత్రం తమిళంలో విడుదలయింది.
కాగా టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. గతంలో శింబు నటించిన ఓ చిత్రం విషయంలో వివాదం కొసాగుతోంది. దీనితో ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకు వెళ్ళింది. ఈ వివాదం కారణంగా 'Maanaadu' చిత్రం విడుదలపై కూడా చాలారోజులు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై విజయాన్ని అందుకుంది.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో శింబు తండ్రి టి రాజేందర్ కి, మానాడు నిర్మాత సురేష్ కి మధ్య వివాదం చెలరేగింది. మానాడు శాటిలైట్ హక్కుల డీల్ వ్యవహారంలో ఇద్దరి మధ్య బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. దీనితో టి రాజేందర్.. సురేష్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. సురేష్ తో పాటు, మానాడు ఫైనాన్సియర్ కి కూడా లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
మానాడు సినిమా రిలీజ్ ముందు శాటిలైట్ హక్కుల విషయంలో సురేష్, ఫైనాన్సియర్ ఉత్తమ్ చాంద్, రాజేందర్ మధ్య చర్చ జరిగింది. శాటిలైట్ హక్కులని తాను 5 కోట్లకు పైనే అమ్మిపెడతానని రాజేందర్ మాట ఇచ్చారు. దీనిప్రకారం ఒప్పందంపై ఉత్తమ్ చంద్.. రాజేందర్ సంతకం తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం శాటిలైట్ హక్కులు 5 కోట్ల కంటే తగ్గితే రాజేందర్ బాధ్యత తీసుకోవాలి. మిగిలిన మొత్తం చెల్లించాలి అని డీల్ మాట్లాడుకున్నారు.
సినిమా విడుదలయ్యాక రాజేందర్ కి చెప్పకుండానే సురేష్, ఉత్తమ్ ఇద్దరూ మానాడు శాటిలైట్ హక్కులని భారీ ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఒప్పందం ఉన్నప్పటికీ తనకు మాటైనా చెప్పకుండా శాటిలైట్ హక్కులని ఎలా అమ్ముతారు అంటూ రాజేందర్ నిర్మాతపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా హీరో శింబు ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు కరోనా అంటూ వదంతులు వ్యాపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. కేవలం జ్వరంతోనే శింబు చికిత్స తీసుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. శింబుకి కరోనా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
Also Read: Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బ్లాస్టింగ్ పిక్స్.. కవ్వించే ఒంపుసొంపులతో అందాల జాతర