పగబట్టిన పాముని చంపడమే మార్గం.. గూస్బమ్స్ తెప్పిస్తున్న `మహాసముద్రం` ట్రైలర్
శర్వానంద్(sharwanand), సిద్ధార్థ్ (siddharth) హీరోలుగా నటిస్తున్న చిత్రం `మహాసముద్రం`(mahasamudram trailer). ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. యాక్షన్, రొమాన్స్, లవ్, రివేంజ్ మేళవింపుగా ట్రైలర్ సాగుతూ గూస్బమ్స్ తెప్పిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.
శర్వానంద్(sharwanand), సిద్ధార్థ్(siddharth), అను ఇమ్మాన్యుయెల్, అదితి రావు హైదరీ కలిసి నటిస్తున్న చిత్రం `మహాసముద్రం`(mahasamudram). `ఆర్ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర(అనిల్ సుంకర) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, రొమాన్స్, లవ్, ప్రతీకారం మేళవింపుగా సాగే ఈ ట్రైలర్ గూస్బమ్స్ తెప్పిస్తుంది. అజయ్ భూపతి నుంచి మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే సందేశాన్నిస్తుంది.
ట్రైలర్లో శర్వానంద్, అను ఇమ్మాన్యుయెల్ జోడీగా కనిపిస్తున్నారు. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ మరో జోడిగా నటిస్తున్నారు. శర్వానంద్ డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది. `సముద్రం చాలా గొప్పది మామ.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుందని`, `ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకాలు మనకూడా(ఫేవర్గా) రాసి ఉండాలి` అని చెప్పడం సినిమా కథలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. మరోవైపు `పగబట్టిన పాముని చంపడం ఒక్కటే మార్గమని` జగపతిబాబు కోపంతో చెప్పడం, `మీరు చేస్తే నీతి, నేను చేస్తే బూతా.. `అని సిద్ధార్థ్ చెప్పడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
మరోవైపు `నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు అర్జున్.. నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్ని రాత్రులు కోరుకుంటాయి` అని అను ఇమ్మాన్యుయెల్ చెప్పడం, చివరగా సిద్ధార్థ్.. అదితిపై గన్ ఎక్కుపెట్టడం మరింత ఆసక్తిని రెకేత్తిస్తుంది. ఇందులో `కేజీఎఫ్` విలన్ సైతం నటిస్తుండటం మరో విశేషంగా చెప్పొచ్చు. మొత్తంగా `మహాసముద్రం` ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.