Asianet News TeluguAsianet News Telugu

హిందీ రీమేక్ గా 'అప‌రిచితుడు'..డిటేల్స్


తమిళ  స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్.  అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడు విక్ర‌మ్.  ఈ సినిమా వ‌చ్చి 16 ఏళ్లు అవుతుంది. 2005లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

Shankar to remake  Aparichithudu  in Bollywood with Ranveer Singh jsp
Author
Hyderabad, First Published Mar 20, 2021, 12:47 PM IST

హిందీ వాళ్ల‌కు మన సౌతిండయిన్  క‌థ‌ల‌పై మ‌క్కువ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఫరవాలేదు అనుకున్న సినిమాలను సైతం ఒదిలిపెట్టడం లేదు. ఇక ఇప్పుడు పాత సినిమాల రైట్స్ కూడా తీసేసుకుని రీమేక్ చేసేందుకు రెడీ అయ్యిపోతున్నారు.  తాజాగా వాళ్ల దృష్టి `అప‌రిచితుడు`పై ప‌డినట్లు సమాచారం. ఆ సినిమా రీమేక్ లో బాలీవుడ్ యంగ్ హీరో ఒకరు నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తమిళ  స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్.  అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడు విక్ర‌మ్.  ఈ సినిమా వ‌చ్చి 16 ఏళ్లు అవుతుంది. 2005లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాని రీమేక్ చేయమని ఓ బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ .. శంక‌ర్ ని సంప్ర‌దించినంద‌ని బాలీవుడ్ టాక్‌. దానికి శంక‌ర్ కూడా ఓకే చెప్పాడ‌ట‌. బాలీవుడ్ యంగ్ స్టార్ ర‌ణ‌బీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది‌. రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తోన్న స‌ర్క‌స్ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చిర ర‌ణ్‌వీర్ చెన్నైకి వ‌చ్చి మ‌రీ శంక‌ర్‌ని క‌లిశారు. 

అయితే రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఈ మూవీలో ర‌ణ్‌వీర్ క‌నిపించ‌నున్నాడ‌ని.. అందుకే అత‌డు వ‌చ్చి ర‌ణ్‌వీర్‌ని క‌లిశాడ‌ని టాక్ వ‌చ్చింది. కానీ తాజా స‌మాచారం ప్రకారం అప‌రిచితుడు రీమేక్ కోసం ర‌ణ్‌వీర్, శంక‌ర్‌ని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.శంక‌ర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాకే.. అప‌రిచితుడు బాలీవుడ్ రీమేక్ మొద‌ల‌వుతుంది. .

ఇక రామ్‌చరణ్‌,శంకర్‌ కాంబో విషయానికి వస్తే ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాలో రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ - రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ  సంస్థకు 50వ చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్‌ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. రష్మిక చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకోనుందని సినీవర్గాల సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios