Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్:చరణ్‌ మూవీకి శంకర్ రెమ్యునేషన్ ఎంతంటే..!

రీసెంట్ గా కోర్టు అడ్డంకులు కూడా తొలిగిపోయిన ఈ  నేపధ్యంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన రోజుకో వార్త మీడియాలో ప్రత్యక్ష్యమవుతోంది. తాజాగా ఈ సినిమా నిమిత్తం శంకర్ తన రెమ్యునేషన్ గా ఎంత తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
 

Shankar Remuneration For Ram Charan And Dil Raju Movie-jsp
Author
Hyderabad, First Published Jul 8, 2021, 11:33 AM IST

తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను రూపొందించిన తమిళ దర్శకుడు శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ తీయలేదు. తాజాగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏తో కలిసి ఓ సినిమా తీయబోతున్నారు. ఈ మేరకు రంగం సిద్దమైంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. రీసెంట్ గా కోర్టు అడ్డంకులు కూడా తొలిగిపోయిన ఈ  నేపధ్యంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన రోజుకో వార్త మీడియాలో ప్రత్యక్ష్యమవుతోంది. తాజాగా ఈ సినిమా నిమిత్తం శంకర్ తన రెమ్యునేషన్ గా ఎంత తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు...  రామ్ చరణ్ తో చేస్తున్న 15వ సినిమాకి తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ సినిమాకి శంకర్ తీసుకుంటున్నారు. అది కూడా 40 కోట్లుదాకా తీసుకుంటున్నారని అని ఓ టాక్ వైరల్ అవుతుంది. అది నిజమే అంటున్నారు. ఎందుకంటే ఇండియన్ 2 నిమిత్తం అదే మొత్తం తీసుకున్నట్లు లైకా ప్రొడక్షన్ హౌస్ అప్పట్లో కోర్టుకు సబ్మిట్ చేసి అఫిడవిట్ లో చెప్పింది. అయితే ఈ మొత్తం పూర్తిగా డబ్బు రూపంలో కాకుండా కొంత..తమిళనాట కొన్ని ఏరియాల రైట్స్ రూపంలో ఆయన బోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దిల్ రాజు ఎగ్రిమెంట్ చేసారంటున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  కమల్ హాసన్‌తో చేస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమాను పక్కన పెట్టి మరి ఈ సినిమాపై వర్క్  చేస్తున్నాడు శంకర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించడం దాదాపు ఖాయం అయింది. మరోవైపు ఈ సినిమాను శంకర్.. తొమ్మిది నెలల్లో పూర్తి చేయనున్నట్టు సమాచారం. ముందుగా వీరిద్దరి కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పినా.. ఫైనల్‌గా మాత్రం పొలిటికల్ డ్రామా అని చెబుతున్నారు. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది.ఈ  సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరోను సంప్రదించినట్టు సమాచారం.

‘జెంటిల్‌మెన్‌’తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్‌ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం. అలాగే ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.

 శంకర్‌ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్‌ నుంచి అభిమానులు కోరుకునే మాస్‌ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్‌ చేయని సరికొత్త పాత్రలో శంకర్‌ చెర్రీని చూపించనున్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో స్టార్ కాస్టింగ్  కూడా భారీగానే ఉండనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios