Asianet News TeluguAsianet News Telugu

ఆ ముగ్గురు హీరోలతో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్.. స్వప్న సినిమా బ్యానర్ పై ఓ సినిమా తీయడానికి సిద్ధమవుతోంది.

shalini pandey to work with three actors
Author
Hyderabad, First Published Jun 20, 2019, 3:29 PM IST

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్.. స్వప్న సినిమా బ్యానర్ పై ఓ సినిమా తీయడానికి సిద్ధమవుతోంది. 'పిట్టగోడ' ఫేమ్ దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా షాలిని పాండేని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో కాస్త ఫేం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు.

ఆ పాత్రకు షాలిని పాండే సూట్ అవుతుందని భావించి ఆమెని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాత్ర ప్రకారం సినిమాలో షాలిని ఓ న్యాయవాదిగా కనిపించనుండి. సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి.

త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు అనుదీప్ చెప్పిన కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. 'మహానటి' వంటి భారీ సినిమా రూపొందించిన  తరువాత స్వప్న సినిమా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios