నిర్మాతకు నచ్చకే.. సమంత సినిమా రీషూట్..?
నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్లో సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్లో సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. అయితే అవుట్ ఫుట్ చూసుకున్న నిర్మాత సురేష్ బాబు కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసారట. ఈ మేరకు ఆయన దర్శకురాలు నందినీ రెడ్డి రీ షూట్ చేయమని ఆదేశించారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో కానీ ఇప్పటిదాకా నందినీరెడ్డి కానీ, సమంత కానీ స్పందించలేదు.
ఓ బేబీ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ...నాకు చాలా కాలంగా పూర్తి ఎంర్టైన్మెంట్ కథా చిత్రంలో నటించాలన్న ఆశ ఉంది. అది ఓ బేబీతో తీరుతుంది. చిత్రం ఆధ్యంతం నవ్వుకునేలా ఉంటుంది,ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకం కాబోతోంది. నా ప్రియమైన దర్శకురాలు నందిని రెడ్డి నాకు ఎంతో ఇష్టమైన పాత్రను ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. ఆమె ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇందులో సమంత కొడుకుగా రావు రమేశ్ కనిపించనున్నారట. చిత్రం ఏమిటంటే...‘అత్తారింటికి దారేది, రాజుగారి గది 2’చిత్రాల్లో రావు రమేశ్ కూతురిగా సమంత యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు యంగ్ హీరో నాగశౌర్య కనిపిస్తారు.