హీరో నాగ చైతన్య-సమంత విడిపోయి రెండేళ్లు కావస్తుంది. అయితే ఇద్దరి మధ్య ఇంకా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
2018లో గ్రాండ్ గా గోవాలో వివాహం చేసుకున్న నాగ చైతన్య-సమంతల వివాహ బంధం నాలుగేళ్లు సవ్యంగా సాగింది. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పటి నుండి ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. కాగా సమంత వద్ద రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. వాటిలో హ్యాష్ ఒకటి. ఇది నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పటి నుండి ఉంది.
ఈ క్రమంలో హ్యాష్ తో నాగ చైతన్యకు కూడా అనుబంధ ఉంది. విడిపోయాక హ్యాష్ సమంత వద్దే ఉంటుంది. సమంత ఇంట్లో ఉంటే హ్యాష్ తోనే గడుపుతుంది. అనూహ్యంగా హ్యాష్ నాగ చైతన్య వద్ద ప్రత్యక్షమైంది. దీంతో ఇదేం ట్విస్ట్ అని జనాలు అవాక్కయ్యారు. తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నాగ చైతన్య తన స్టాఫ్ మెంబర్ కొన్న కొత్త బైక్ పై ఆటోగ్రాఫ్ చేశాడు.
స్టాఫ్ మెంబర్ కోరిక మేరకు ఫస్ట్ రైడ్ కూడా చేశాడు. ఈ వీడియోలో హ్యాష్ కూడా ఉంది. సమంత పెట్ డాగ్ నాగ చైతన్య వద్ద కనిపించడం చర్చకు దారి తీసింది. విడిపోయినప్పటికీ ఇద్దరూ కలుస్తున్నారా? సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. భార్యాభర్తలు విడిపోతే వారికి పిల్లలు ఉంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. అయితే ఇంకొకరికి కూడా పిల్లల్ని కలిసే హక్కు కోర్ట్ కల్పిస్తుంది. అలాగే నాగ చైతన్య తమ పెట్ డాగ్ ని అప్పుడప్పుడు కలుస్తున్నాడేమో అనే సందేహం కలుగుతుంది.
సమంత అయితే నాగ చైతన్యను కలవడం, మాట్లాడటం చేయదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చైతు మీద చాలా కోపంగా ఉంది. పలు సందర్భాల్లో చైతన్య పై తనకున్న ఆవేశాన్ని బయటపెట్టింది. కాబట్టి హ్యాష్ నాగ చైతన్యతో ఉన్నంత మాత్రానా సమంతతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పలేం అంటున్నారు.