అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత.. స్పందించిన మేనేజర్..
సమంత మరోసారి అనారోగ్యానికి గురయ్యారని, ఆమె ఆసుపత్రిలో చేరారనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో మేనేజర్ స్పందించారు. మరోవైపు `యశోద` మూవీకి కోర్ట్ షాకిచ్చింది.
సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతుంది. కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి ఇది. ఈ విషయాన్ని అక్టోబర్ చివరి వారంలో సమంత వెల్లడించింది. `యశోద` విడుదలకు ముందు ఈ విషయాన్ని చెప్పి సింపథి కొట్టేసింది. ఆ తర్వాత కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత మరోసారి అనారోగ్యానికి గురైందని, ఆసుపత్రిలో చేరిందనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రధానంగా తమిళ మీడియాలో ఈ న్యూస్ గుప్పుమంది. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుందని రాసుకొచ్చారు. కోలీవుడ్లో ఈ వార్తలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. పుకార్లకి పుల్ స్టాప్ పెట్టాలని వెల్లడించారు.
ఇదిలా ఉంటే `యశోద` సినిమాకి షాకిచ్చింది కోర్ట్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు తదుపరి విచారణ జరుపనున్నట్టు తెలిపింది. నవంబర్ 11న `యశోద` సినిమా థియేటర్లలో విడుదలైంది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ రెండో వారం(డిసెంబర్9న) ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఓటీటీ రిలీజ్ని ఆపాలని కోర్టు వెల్లడించింది.
సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కి `ఈవా`అనే పేరు పెట్టారు. అందులో అక్రమాలు జరుగుతున్నట్టుగా సినిమాలో చూపించారు. సినిమాలో తమ ఆసుపత్రి పేరు చూపించడం పట్ల తమ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ `ఈవా ఆస్పిటల్` యాజమాన్యం సిటీ సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో యశోద సినిమాని డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని నిర్మాణ సంస్థని కోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారన డిసెంబర్ 19కి వాయిదా వేసింది.