Asianet News TeluguAsianet News Telugu

Acharya:' ఆచార్య‌ ' ని వాడేస్తున్న సల్మాన్, కలిసొస్తుందా?

. గతంలో, ఆచార్య టెంపుల్ టౌన్ సెట్‌లు పేర్కొన్న ప్రాంతంలో ఈ విలేజ్ సెట్ ని వేసారు. ఆచార్య సెట్ నే కాస్తంత మార్పులతో   సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళి కి విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రెడీ చేసారు.

Salman Khan Using Chiranjeevi Acharya sets!
Author
Mumbai, First Published May 24, 2022, 2:57 PM IST


చిరంజీవి, సల్మాన్ ఖాన్ చాలా మంచి ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నటిస్తున్నారు.  అదే సమయంలో  చిరంజీవి సల్మాన్ ఖాన్‌కు హెల్ప్ చేయాలనుకన్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ప్రాజెక్ట్ కభీ ఈద్ కబీ దివాళి షూటింగ్ హైదరాబాద్‌లోని కోకాపేట్ ప్రాంతంలోని చిరంజీవి ప్రైవేట్ ల్యాండ్‌లో జరుగుతోంది. గతంలో, ఆచార్య టెంపుల్ టౌన్ సెట్‌లు పేర్కొన్న ప్రాంతంలో ఈ విలేజ్ సెట్ ని వేసారు. ఆచార్య సెట్ నే కాస్తంత మార్పులతో   సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళి కి విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రెడీ చేసారు.

 ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఒక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే  సల్మాన్, వెంకీ  నటించిన భాగాన్ని కోకాపేట్‌లోని ప్రత్యేక సెట్‌లో చిత్రీకరించనున్నారు. మొత్తం మీద, సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఆచార్య సెట్ మాడిఫై చేసి  తిరిగి ఉపయోగించారు. 2-3 వారాల పాటు కంటిన్యూగా  షూటింగ్ జరగనుంది. ఇక చిరంజీవి, సల్మాన్ ఖాన్ చేసే స్పెషల్ సాంగ్   చిత్రీకరణ కోసం వచ్చే నెల ప్రారంభంలో ముంబైకి వెళ్లనున్నారు. 

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ముంబైలోని గాడ్‌ఫాదర్ మూవీ సెట్స్‌లో సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారియి. అయితే ఈ సినిమాలో సల్మాన్ నటించడానికి ఒప్పుకునే ముందు చిరంజీవికి ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఫ్యామిలీతో తనకున్న సాన్నిహిత్యంతోనే గాడ్‌ఫాదర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని.. ఈ సినిమాలో తనది కేవలం కేమియో పాత్రే కావడంతో తాను ఎలాంటి రెమ్యునరేషన్ పుచ్చుకోబోనంటూ సల్మాన్ తేల్చి చెప్పాడట. అందుకే ఇలా ఆచార్య సెట్ ని ఫ్రీగా చేసుకోమని చిరంజీవి ఇచ్చారని వినికిడి.
 
ఇక ఆచార్య విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌లైంది. తండ్రీ కొడుకులు చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ తొలిసారి పూర్తి స్థాయి పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం కావ‌డంతో పాటు ఫెయిల్యూర్స్ లేని కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా ఈ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో స‌క్సెస్ కాలేదు. మెగాభిమానుల‌కు నిరాశ‌ను మిగిల్చిన చిత్రంగా ఆచార్య మిగిలిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios