Asianet News TeluguAsianet News Telugu

ఆ సన్నివేశంలో ప్రభాస్ డూప్ వద్దన్నాడు...  సలార్ విలన్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ మూవీలో విలన్ రోల్ చేసిన ఎమ్మెస్ చౌదరి కీలక విషయాలు వెల్లడించారు. 
 

salaar villain ms chowdary interesting comments on hero prabhas ksr
Author
First Published Jan 26, 2024, 4:19 PM IST

సలార్ మూవీ ప్రభాస్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 700 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అలా ప్రెజెంట్ చేశాడు. ఈ మూవీలో పలువురు పేరున్న నటులు కీలక రోల్స్ చేశారు. నటుడు ఎమ్మెస్ చౌదరి కి మంచి పాత్ర దక్కింది. ప్రభాస్ ని కొట్టే ఏకైక విలన్ గా సలార్ లో ఎమ్మెస్ చౌదరి రోల్ ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ చౌదరి ప్రభాస్ ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. 

ఎమ్మెస్ చౌదరి మాట్లాడుతూ... 'నేను సెట్స్ లో హీరోలతో మాట్లాడే ప్రయత్నం చేయను. నా పాటికి నేను దూరంగా కూర్చుంటాడు. కొందరు వారితో ముచ్చట్లు పెట్టుకోవాలని ఆశపడతారు. అలా చేయడం వలన హీరోలు విసుగ్గా ఫీల్ అవుతారు. నేను కేవలం షాట్ ఉన్నప్పుడు పలకరిస్తానంతే. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ అందరితో కలిసిపోతారు. చాలా సరదాగా ఉంటారు. 

సలార్ చిత్రంలో ప్రభాస్ నా కాళ్ళు పట్టుకునే సన్నివేశం ఒకటి ఉంది. ఎలా చిత్రీకరించారని రెండు మూడు కోణాల్లో ట్రై చేశారు. కాసేపటి తర్వాత డూప్ నేను చేస్తాను అని వచ్చాడు. వద్దని చెప్పిన ప్రభాస్, తానే స్వయంగా ఆ షాట్ పూర్తి చేశాడు. సలార్ షూటింగ్ ముగిశాక ప్రభాస్ బెంగుళూరులో పార్టీ ఇచ్చారు. దానికి నేను కూడా హాజరయ్యాను' అని అన్నాడు. 

సలార్ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. అసలు కథ అంతా పార్ట్ 2లో దాచిపెట్టాడని సమాచారం. సలార్ లో ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రభాస్-పృథ్విరాజ్ సలార్ 2లో బద్ధ శత్రువులుగా కనిపించనున్నారు. ప్రధాన సంఘర్షణ ఈ రెండు పాత్రల మధ్య ఉంటుంది. ఇక సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటించింది. ఈశ్వరి రావు, జగపతిబాబు, బాబీ సింహ, శ్రియా రెడ్డి కీలక రోల్స్ చేశారు. 2023 డిసెంబర్ 22న సలార్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదలైంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios