Salaar Trailer : ‘సలార్’ ట్రైలర్ బీభత్సం.. ‘కేజీఎఫ్2’ రికార్డు బ్రేక్.. ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన ప్రభాస్..
‘సలార్’ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మాసీవ్ రెస్పాన్స్ తో బీభత్సం సృష్టిస్తోంది. 24 గంటల్లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్, లైక్స్ ను దక్కించుకొని ‘కేజీఎఫ్2’ ను దాటేసింది. ప్రస్తుతమూ వ్యూస్ ను దక్కించుకుంటూ ట్రెండింగ్ లోనే ఉంది.
![Salaar Trailer break the Kgf2 Record and conquers YouTube with Huge views and likes NSK Salaar Trailer break the Kgf2 Record and conquers YouTube with Huge views and likes NSK](https://static-ai.asianetnews.com/images/01hgnkwjqavr26erv01pfsw5y3/salaar-trailer-11-jpg_363x203xt.jpg)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో ‘సలార్’ వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా అన్నీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఎప్పటి నుంచో Salaar Trailer కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న పండగ తెచ్చారు. పవర్ ఫుల్ ట్రైలర్ ను విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. గతంలో విడుదలైన టీజర్ కే మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ దక్కింది. ఇక ట్రైలర్ మాత్రం బీభత్సమైన స్పందనను దక్కించుకుంటోంది.
డిసెంబర్ 1న సాయంత్రం 7:19 నిమిషాలకు సలార్ ట్రైలర్ విడుదలైంది. నేటి సాయంత్రంతో ఒక రోజు పూర్తి చేసుకుంది. విడుదలైన గంటలోనే 50 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని సెన్సేషన్ గా మారింది. ఇవ్వాళ్టితో 24 గంటలు గడిచింది. ఈ సందర్భంగా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ ను మేకర్స్ వెల్లడించారు. యూట్యూబ్ లో అన్నీ భాషల్లో విడుదలైన సలార్ ట్రైలర్ రికార్డు బ్రేకింగ్ వ్యూస్, లైక్స్ ను దక్కించుకుంది. ఒకరోజులో 116 మిలియన్ల వ్యూస్ ను, 2.7 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుంది.
అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్2’ ట్రైలర్ 24 గంటల్లో 106 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు అదే హయ్యేస్ట్. ఆ రికార్డును తాజాగా ‘సలార్’ బ్రేక్ చేసింది. ఇంకా లక్షల్లో వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ట్రైలర్ కే ఇంత బీభత్సం చూపిస్తున్నారంటే.. సినిమా థియేటర్లలోకి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత ఖాయమంటున్నారు. ఇప్పటికే 2000 కోట్ల వసూళ్లను అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బర్రూర్ సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉండనుందని ట్రైలర్ తో అర్థమవుతోంది. సినిమా కోసం ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలో టీమ్ ప్రమోషన్స్ లో దిగనుంది.