Asianet News TeluguAsianet News Telugu

సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్!

2019లో విడుదలైన మహర్షి చిత్రంలోని నటనకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకి మహేష్ ఎంపిక కావడం జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మహేష్ స్వయంగా పాల్గొని, అవార్డు అందుకున్నారు. 

sakshi excellence awards mahesh babu wins best actor for maharshi movie
Author
Hyderabad, First Published Sep 18, 2021, 7:48 AM IST

సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు మెరిశారు. మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు కైవశం చేసుకున్నారు. 2019లో విడుదలైన మహర్షి చిత్రంలోని నటనకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డుకి మహేష్ ఎంపిక కావడం జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మహేష్ స్వయంగా పాల్గొని, అవార్డు అందుకున్నారు. 


మరో రెండు విభాగాల్లో మహర్షి మూవీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డ్స్ సైతం మహర్షి చిత్రం గెలుచుకుంది. దీనితో దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు వేదికపై కి వెళ్లి మహేష్ తో పాటు అవార్డ్స్ అందుకున్నారు. మహర్షి చిత్రానికి మూడు అవార్డ్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. 


కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మహర్షి, మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉంది. గత ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో మహర్షి మూవీ బెస్ట్ పాప్యులర్ ఫిల్మ్  హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో అవార్డు గెలుచుకోవడం విశేషం. దేవిశ్రీ మహర్షి చిత్రానికి సంగీతం అందించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios