సాయి తేజ్ - మారుతి చిత్రం టైటిల్ , స్టోరీ లైన్!
సాయి తేజ్ - మారుతి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
సాయి తేజ్ - మారుతి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్ పెట్టబోడున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. మారుతి కథలు ఎంటర్టైనింగ్ గా సాగుతాయి. ఈసారి ఫన్ తో పాటు కుటుంబ బంధాలు, మానవ సంబంధాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లబోతోంది.
హీరోయిన్ గా మాళవికని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సినిమా లో ప్రధాన కథ హీరోకు అతని తండ్రి మధ్య జరుగుతుందని తెలుస్తోంది. డబ్బుకి తప్ప ప్రేమాభిమానాలకు చోటివ్వని ఓ తండ్రిని ఓ తనయుడు తన తాత సహాయంతో ఎలా మార్చాడన్నదే ఈ చిత్ర కథని సమాచారం. సాయి తేజ్ కి తండ్రి గా రావు రమేష్ ని మారుతి ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.