Asianet News TeluguAsianet News Telugu

అంచనాలు పెంచేస్తున్న సాయి పల్లవి లుక్‌.. అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా!

విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది. ఓ అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా కూర్చున సాయి పల్లవి స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు దర్శకుడు వేణు ఉడుగుల.

Sai pallavi Look From Virataparvam Movie
Author
Hyderabad, First Published May 9, 2020, 10:43 AM IST

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన నీది నాది ఒకే  కథ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వేణు ఉడుగుల. ప్రతి ఇంట్లో కనిపించే ఓ సామాన్యుడి కథను, తెరపై మనసుకు హత్తుకునేలా చూపించిన వేణు తొలి సినిమాతోనే కమర్సియల్‌గానూ మంచి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంగానూ రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా విరాటపర్వం అనే పీరియాడిక్‌ కథను ఎంచుకున్నాడు. రానా, సాయి పల్లవిలు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అయితే ఈ రోజు (శనివారం) సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది. ఓ అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా కూర్చున సాయి పల్లవి స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు దర్శకుడు వేణు.

ఈ లుక్‌ తో పాటు `అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే` అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌తో సినిమా మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో విలక్షణ నటి నందిత దాస్‌తో పాటు ప్రియమణి, నవీన్‌ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios