Asianet News TeluguAsianet News Telugu

మహేష్ కోసం సాయి పల్లవి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Sai Pallavi In Talks For Mahesh Babu film
Author
Hyderabad, First Published Mar 4, 2019, 1:49 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయంలో ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

అదేంటంటే.. ఇప్పటివరకు మహేష్ ఒక సినిమా తరువాత మరొకటి చేస్తూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకటి సుకుమార్ సినిమా కాగా, మరొకరి అనీల్ రావిపూడితో అని తెలుస్తోంది. అనీల్ తో మహేష్ సినిమా చేయడం పక్కా అని సమాచారం.

దీనికి నిర్మాతలుగా దిల్ రాజు, అనిల్ సుంకర పని చేయనున్నాడు. దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో ఆమెకి కథ వినిపించడం కోసం దర్శకుడు అనీల్ రావిపూడి చెన్నైకి బయలుదేరి వెళ్ళినట్లు చెబుతున్నారు.

అక్కడే దేవిశ్రీప్రసాద్ కి కూడా కథ వినిపిస్తారట. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేసింది సాయి పల్లవి. తెలుగులో ఆమెకి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు లేనప్పటికీ మహేష్ సినిమాలో తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!

Follow Us:
Download App:
  • android
  • ios