నిహారిక నా మరదలే..కానీ చెల్లి లాంటిది: సాయిధరమ్ తేజ
- నిహారికతతో పెళ్లి వార్తలను ఖండించిన సాయి ధరమ్ తేజ
- తనకు నిహారిక చెల్లి లాంటిదని స్పష్టం చేసిన సాయి ధరమ్ తేజ
- తనపై వస్తున్న రూమర్స్ అన్నీ గాలి మాటలేనన్న సుప్రీం హీరో
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజతో నాగబాబు కూతురు పెళ్లి అంటూ ఓ పుకారు టాలీవుడ్లో తెగ షికారు చేస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ పుకారు సారాంశం ఏంటంటే సాయిధరమ్తేజ్కీ, నిహారికకూ పెళ్లనేది. తేజూ – నిహారిక ఈమద్య కాస్త టచ్లో ఉండడం చూసి, ఇద్దరి మధ్యా ఏదో ఉందని, అది లవ్వేనని, ఈ లవ్ మేటర్ ఇంట్లోవాళ్లకూ తెలిసిపోయిందని, ఎలాగూ బంధుత్వం ఉంది కాబట్టి.. మెగా ఫ్యామిలీ వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు వార్తలు వండేసుకొంటున్నారు.
అయితే.. అసలు తేజూ – నిహారిక మధ్య లవ్ అన్నదే పెద్ద జోక్ అని సాయిధరమ్ తేజ్ పర్సనల్ పీఆర్ఓ కుండబద్దలు కొట్టేశాడు. ”తేజూ, నిహారిక మధ్య ఏదో ఉందని వార్తలొస్తున్నాయి. దానంత జోక్ మరోటి లేదు`”అని కొట్టి పరేశాయి ధరమ్ తేజ సన్నిహిత వర్గాలు. అయినా రూమర్ స్ప్రెడ్ అవటం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దాంతో... నేరుగా తనే రంగంలోకి దిగాడు సుప్రీం హీరో.
తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పందించి... ”ఈ వార్తలు నిజం కావు. నిహారిక నాకు చెల్లెలు లాంటిది” అంటూ కొట్టి పరేశాడు. సాయిధరమ్ తేజ్ మహా గడసరి. నాలుగు సినిమాలు చేశాడో, లేదో… రెండు మూడు లవ్ మేటర్లలో ఇన్వాల్వ్ అయిపోయాడు. టాలీవుడ్లోని ఓ ప్రముఖ కథానాయికతో మనోడు డేటింగ్లో ఉన్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఈవిషయంలో అల్లు అరవింద్ ఓసారి తేజూపై సీరియస్ అయ్యారన్న గుసగుసలు వినిపించాయి.
అయినా సరే.. ఆ కథానాయికతో చనువుగా ఉండడం మానలేదట. ఇప్పటికీ తేజూ గుట్టు చప్పుడు కాకుండా తన డేటింగ్ వ్యవహారం నడిపేస్తున్నాడని తెలుస్తోంది. అలాంటప్పుడు నిహారిక-తేజూల పెళ్లి ఎలా జరుగుతుంది. ఏదో పుకార్లు లేపడానికి కాకుంటే.