'ప్రతిరోజు పండగే'నంటున్న మెగాహీరో!
మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.
మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా రాశిఖన్నా కనిపించనుంది.
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమా మొదలైందని సాయి ధరం తేజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ తేజు ఇటీవల 'చిత్రలహరి'తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. మారుతీతో తో చేయబోయే తన కొత్త సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. మారుతి కెరీర్ కి కూడా ఈ సినిమా ఎంతో కీలకం. తనదైన స్టైల్ లో కామెడీ, కమర్షియల్ యాంగిల్ లో సినిమాను రూపొందిస్తున్నాడు.
#PratiRojuPandaage @GeethaArts @UV_Creations @DirectorMaruthi @RaashiKhanna @MusicThaman #jaykumar new beginnings...need all your blessings #SDT12 pic.twitter.com/UjuHOIMGsg
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 24, 2019
My next film with@IamSaiDharamTej #PratiRojuPandaage pooja held today #AlluAravind presents Producer BunnyVas on @UV_Creations @Ga2Pictures @RaashiKhanna is playing the female lead @MusicThaman scoring music, Art Ravinder, Dop Jayakumar,co producer @SKNonline pic.twitter.com/f9xiipypqN
— Maruthi director (@DirectorMaruthi) June 24, 2019