Asianet News TeluguAsianet News Telugu

'ప్రతిరోజు పండగే'నంటున్న మెగాహీరో!

మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. 

sai dharam tej new film prathiroju pandage launched
Author
Hyderabad, First Published Jun 24, 2019, 1:05 PM IST

మెగాహీరో సాయి ధరం తేజ్ తాజాగా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు మారుతి రూపొందించనున్న ఈ సినిమాకి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా రాశిఖన్నా కనిపించనుంది.

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమా మొదలైందని సాయి ధరం తేజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ తేజు ఇటీవల 'చిత్రలహరి'తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. మారుతీతో తో చేయబోయే తన కొత్త సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. మారుతి కెరీర్ కి కూడా ఈ సినిమా ఎంతో కీలకం. తనదైన స్టైల్ లో కామెడీ, కమర్షియల్ యాంగిల్ లో సినిమాను రూపొందిస్తున్నాడు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios