సుక్కు,సాయి తేజ కాంబో, ఓ మిస్టిక్ థ్రిల్లర్
ఈ సారి మిస్టరీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ప్లే అందించడం విశేషం. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
జయాపజయాలకు సంభందం లేకుండా ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. వరుస ఫ్లాఫ్ ల తర్వాత గతేడాది ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’చిత్రాలతో కాస్త రిలీఫ్ అయ్యారు. సక్సెస్ దారిలో పడ్డారు. ప్రస్తుతం సాయి నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు సాయి తేజ్.
ఈ సారి మిస్టరీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ప్లే అందించడం విశేషం. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
‘‘సరికొత్త జానర్లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది కూడా నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ గారితో కలిసి పనిచేయడం మరింత ప్రత్యేకం. #SDT15 మిస్టరీ థ్రిల్లర్ను ఎస్వీసీసీ బ్యానర్పై నిర్మిస్తున్నారు’’ -ట్విటర్లో సాయి ధరమ్ తేజ్
దర్సకుడు కార్తీక్ దండు గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేసారు. త్వరలోనే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించనున్నారు. సాయి ధరమ్ తేజ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్, దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు.