Asianet News TeluguAsianet News Telugu

సచిన్  "వీడెవడు" సెప్టెంబర్ 15న విడుదల

  • ‘మౌనమేలనోయి’  చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సచిన్
  • ‘ వీడెవడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సచిన్
  • సచిన్ కి  జోడీగా నటిస్తున్న ఈషా గుప్త
sachin joshi vedevadu movie hits theaters in september 15th

sachin joshi vedevadu movie hits theaters in september 15th

‘మౌనమేలనోయి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సచిన్.  ఆ తర్వాత "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు.హైదరాబాద్ ,గోవా ,పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం యాక్షన్ థ్రిల్లర్ గా సాగుతుందని. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ తెలిపారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని  ఆయన అన్నారు .

 

"ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకత్వం వహిస్తున్నారు.వైకింగ్ మీడియా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సచిన్ సరసన ఈషా గుప్త ఆడిపాడనుంది.

 

ఈ సినిమాకి సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు.ఎడిటింగ్ -ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ -బినేంద్ర  మీనన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-గుడిమిట్ల శివ ప్రసాద్, ప్రొడ్యూసర్ -రైనా జోషి ,స్టోరీ - స్క్రీన్ ప్లే- డైరెక్షన్ :  తాతినేని సత్య అందిస్తున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios