సచిన్ "వీడెవడు" సెప్టెంబర్ 15న విడుదల
- ‘మౌనమేలనోయి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సచిన్
- ‘ వీడెవడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సచిన్
- సచిన్ కి జోడీగా నటిస్తున్న ఈషా గుప్త
‘మౌనమేలనోయి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సచిన్. ఆ తర్వాత "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు.హైదరాబాద్ ,గోవా ,పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం యాక్షన్ థ్రిల్లర్ గా సాగుతుందని. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ తెలిపారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని ఆయన అన్నారు .
"ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకత్వం వహిస్తున్నారు.వైకింగ్ మీడియా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సచిన్ సరసన ఈషా గుప్త ఆడిపాడనుంది.
ఈ సినిమాకి సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు.ఎడిటింగ్ -ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ -బినేంద్ర మీనన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-గుడిమిట్ల శివ ప్రసాద్, ప్రొడ్యూసర్ -రైనా జోషి ,స్టోరీ - స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : తాతినేని సత్య అందిస్తున్నారు.