Asianet News TeluguAsianet News Telugu

రూ.20 కోట్లతో 'సాహో' సినిమా సెట్!

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాభై శాతం ఖర్చు యాక్షన్ సన్నివేశాలకే కేటాయించారట.

saaho movie set worth 20 crores
Author
Hyderabad, First Published Feb 6, 2019, 4:38 PM IST

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాభై శాతం ఖర్చు యాక్షన్ సన్నివేశాలకే కేటాయించారట.

గతంలో అబుదబిలో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన కీలక పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సన్నివేశాలను ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ పై తెరకెక్కించాలని అనుకున్నారు.

కానీ దానికి అధికారులు అనుమతించకపోవడంతో ఆ బ్రిడ్జ్ ని భారీ సెట్ గా వేసి రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రీకరించాలని అనుకున్నారు. సాబు సిరిల్ నిర్మించిన ఈ ఒక్క సెట్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సెట్ లోనే ప్రభాస్, నీల్ నితిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి నాటికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్ట్ 15న సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది!

Follow Us:
Download App:
  • android
  • ios