RRR రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన టీమ్
“ఆర్ ఆర్ ఆర్” ఈ ఏడాది అక్టోబర్ 13న ఖచ్చితంగా విడుదల అవుతుందని అఫీషియల్ గా ప్రకటించినా, కానీ ధర్డ్ వేవ్ ముప్పు భయంతో అది సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. అదే తేదీన రిలీజ్ అవకుండా ఉంటుందనటానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ రకరకాల కారణాలతో లేటైనా మొత్తానికి ఆఖరి స్టేజికి చేరుకొంది. రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ రెండు పాటలు ఈ నెలలో తీస్తారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది.
అయితే “ఆర్ ఆర్ ఆర్” ఈ ఏడాది అక్టోబర్ 13న ఖచ్చితంగా విడుదల అవుతుందని అఫీషియల్ గా ప్రకటించినా, కానీ ధర్డ్ వేవ్ ముప్పు భయంతో అది సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. అదే తేదీన రిలీజ్ అవకుండా ఉంటుందనటానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. కానీ తాజాగా కీరవాణి పుట్టిన రోజుని పురస్కరించుకుని మరోసారి అదే తేదీన వచ్చేస్తున్నాం అని ఖరారు చేసారు టీమ్. ఈ ట్వీట్ లో అడుగున రిలీజ్ డేట్ ఉంటుంది చూడండి.
కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేస్తే దాన్ని అద్బుతంగా జనరంజకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
“ఆర్ ఆర్ ఆర్” సినిమాని దాదాపు 12 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. వాటిల్లో తెలుగు, హిందీ, తమిళ్ కీలకం. హిందీ సినిమాలు అయితే ఈ నెలాఖరు నుంచి విడుదల కానున్నాయి. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు .. “ఆర్ ఆర్ ఆర్” సినిమాని భారీ మొత్తాలకు పెన్ ఇండియా (హిందీ), లైకా (తమిళ్), ఫార్స్ (ఓవర్సీస్) సంస్థలకు అమ్మారు. ఈ మూడు సంస్థలే దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించాయి. అంటే థియేటర్ల నుంచి దాదాపు 600 కోట్ల రూపాయలు రావాలి. దాని అర్దం ఏమిటి...ఇండియా మొత్తం మార్కెట్ ఓపెన్ అయ్యితేనే అది సాధ్యం. అయితే అక్టోబర్ 31 కు థర్డ్ వేవ్ సమస్య ఉండదని టీమ్ నమ్ముతోందన్నమాట. అప్పటికి దేశం మొత్తం రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుందని భావిస్తున్నారని అర్దం చేసుకోవాలి.
సినిమా విశేషాలకు వస్తే.. ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తారక్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకులు సీట్లో కూర్చోలేరంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక భారీ సెట్టింగ్ తో సినిమా మరోలా ఉంటుందని తెలిపాడు తారక్.
ఈ చిత్రంలో హాలీవుడ్.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ నటిస్తున్నారు. కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.