NTR - Rowdy Boys : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్
ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది దిల్ రాజు వారసుడు.. ప్రొడ్యూసర్ శిరీష్ కొడుకు అశీష్ నటించిన రౌడీ బాయ్స్ మూవీ. ఈ సందర్భంగా శనివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
దిల్రాజు ప్రొడక్షన్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న సినిమా రౌడీ బాయ్స్. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ను అందించిన దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్. రౌడీ బాయ్స్(Rowdy Boys) మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా..యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్గా సంక్రాంతి, శుభాకాంక్షలు తెలిపారు. ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా టైమ్ లో దిల్ రాజుగారితో, శిరీష్గారితో అసోషియేషన్ ఏర్పడింది. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజుతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు యంగ్ టైగర్.. అంతే కాదు సినిమా టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రాజుగారితో, శిరీష్గారితో ఉండే జర్నీని ఈ విధంగా.. గుర్తు చేసుకున్నట్లు అయ్యింది. రౌడీ బాయ్స్(Rowdy Boys) ట్రైలర్ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి సినిమాల్లో తను భాగం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అన్నారు.
రౌడీ బాయ్స్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు ఎన్టీఆర్(NTR). రౌడీ బాయ్స్ మంచి చిత్రంగా మనకు గుర్తుండిపోవాలనుని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూస్తుంటే.. ప్రేమ దేశం చూసిన ఎగ్జయిట్మెంట్ వచ్చింది. నాకే కాదు. మీ అందరికీ కూడా అలాంటి ఎగ్జయిట్మెంట్ కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను. వైవిధ్యమైన సినిమాలను, మంచి సినిమలను ఆదరించే మన తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తారనే నమ్మకం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్లోనే చూసి సినిమాకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ.. మా ‘రౌడీ బాయ్స్’(Rowdy Boys) ట్రైలర్ను లాంచ్ చేసి.. అందరికి అభినందనలు తెలియజేసినందుకు మా యంగ్ టైగర్ ఎన్టీఆర్గారికి థాంక్స్. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్’(Rowdy Boys) సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నాం. యూత్ సహా అన్ని వర్గాలకు నచ్చే ఎంటర్టైనర్ ఇది. విక్రమ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, టీజర్కు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది అన్నారు
Also Read : `ఆర్ఆర్ఆర్` ట్రాప్లో పడ్డ చిరంజీవి.. `ఆచార్య`కి తప్పని తిప్పలు.. తలలు పట్టుకుంటున్న అభిమానులు?