సంచలనం అంటే వర్మ.. వర్మ అంటే సంచలనం. ఇక ఈ సంచలనాలలో ఈమధ్య బయోపిక్స్ ను కూడా చేర్చారు రామ్ గోపాల్ వర్మ. ఇక తను ప్రాణానికి ప్రాణంగా భావించి అభిమానించిన శ్రీదేవి మరణం తరువాత కూడా బయెపిక్ ఎందుకు చేయలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఈ ప్రశ్నకు రీసెంట్ గా సమాధానం చెప్పాడు వర్మ, 

రామ్ గోపాల్ వర్మకు అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. తన జీవితంలో శ్రీదేవిని ఇష్టపడినంత ఎక్కువగా మరెవరినీ ఆయన ఇష్టపడలేదు. అసలు వర్మ ఒకరిని ఇష్టపడటమే ఓ వండర్. ఈ విషయాన్ని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. తాజాగా వర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

రీసెంట్ గా వర్మ తనలేటెస్ట్ మూవీ డేంజరస్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు తన మార్క్ సమాధానాలు ఇస్తన్నాడు. ఈ టైమ్ లోనే కేసిఆర్ బయోపిక్ దగ్గర నుంచి చాలా ప్రశ్నలకు వర్మ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఇక తన డ్రీమ్ గర్ల్ శ్రీదేవి గురించి కూడా వర్మ మాట్లాడారు. 

దివంగత శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించాలనేది తన కోరిక అని వర్మ తెలిపారు. అయితే, శ్రీదేవి పాత్రను పోషించడానికి అలాంటి హీరోయిన్ కనిపించడం లేదని... అందుకే ఆ ప్రాజెక్టును విరమించుకున్నానని చెప్పారు. లేకుంటే ఇప్పటికి తన అభిమాన నటి బయోపిక్ తెరపై మెరుపులు మెరిపించేది అన్నారు వర్మ. అయితే ఈ మధ్య పొలిటికల్ బయెపిక్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టిన వర్మ తమిళ మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ బయోపిక్ కూడా తీయాలనుకుంటున్నానని... ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడినప్పటికీ, మళ్లీ ప్రారంభించే అవకాశం లేకపోలేదని తెలిపారు. 

మరో వైపు వర్మ నుంచి రాంబోతున్న ఫ్రెష్ మూవీ డేంజరస్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో నటించి అప్సర రాణి, నైనా గంగూలీలు పెద్ద సాహసమే చేశారు. ఈ సినిమాలో వారు లెస్బియన్స్ గా నటించారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ, స్వలింగ సంపర్కులను మనం చాలా చులకనగా చూస్తామని... ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వారికి అనుమతిని ఇచ్చినా మన దృష్టి కోణం మాత్రం మారడం లేదని అన్నారు. 

ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్ గా ఎందుకు మారారు వారిని సమాజం ఎలా చూస్తుంది అనే అంశాలతో సినిమాను తెరకెక్కించామని చెప్పారు వర్మ. ఈ సినిమాలో నటించేందుకు నైనా గంగూలీ ఫస్ట్ ఒప్పుకోలేదని... షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని వర్మ తెలిపారు. ఈ పాత్రల్లో నటించేందుకు ముందుకొచ్చిన ఇద్దరు హీరోయిన్లను అభినంది