`క్రాక్` షురూ.. హిట్ గ్యారంటీ అట!
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్ మొదలెట్టినట్టు మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
రవితేజ స్పీడ్ పెంచబోతున్నాడు. ఇప్పటికే ఆయన మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న `క్రాక్` సినిమాని షురూ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్ మొదలెట్టినట్టు మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చివరి షెడ్యూల్ జరుపనున్నారట. త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కరోనా వల్ల ఈ చిత్ర షూటింగ్ మార్చిలో ఆగిపోయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఎందుకంటే వరుగా నాలుగు సినిమాలు పరాజయం చెందాయి. తన ఇమేజ్, మార్కెట్ పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అర్జెంట్గా ఆయనకు ఓ హిట్ కావాలి. దీనితో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట రవితేజ. మరి అది వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఇంతకి ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయనున్నారు. `ఠాగూర్` మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.