అభిమానుల అత్యుత్సాహం.. రష్మికకి పాలాభిషేకం!
స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.
స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్ కి కటౌట్ పెట్టి పాలాభిషేకాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఇప్పుడు అలాంటి సంఘటన చోటు చేసుకుంది. కన్నడంలో 'కిరాక్ పార్టీ' చిత్రంతో ఫేమస్ అయిన రష్మిక మందన్నా తెలుగులో కూడా 'ఛలో', 'గీత గోవిందం' వంటి చిత్రాలతో పాపులారిటీ దక్కించుకుంది.
రీసెంట్ ఈమె నటించిన 'యాజమాన' సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఇందులో హీరోగా నటించారు. ఈ సందర్భంగా రష్మిక అభిమానులు థియేటర్ల ముందు ఆమె భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వాటికి పాలాభిషేకాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్మిక అభిమానుల అత్యుత్సాహాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక తెలుగులో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.