#Animal ఓటిటి షాక్, మతిపోయే న్యూస్
డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ నెట్ఫ్లిక్స్లోకి రానుంది.
![Ranbir movie Animal OTT release with 30 minute extended version jsp Ranbir movie Animal OTT release with 30 minute extended version jsp](https://static-ai.asianetnews.com/images/01hgjye23en0j66eqtkwkxttrh/Animal1-1701442947182_363x203xt.jpg)
నిన్న శుక్రవారం రిలీజైన యానిమల్ కు డివైడ్ టాక్ కనిపిస్తోంది. కొంతమందికి పిచ్చ పిచ్చ నచ్చేయగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్ చెప్తున్నారు.టాక్ ఎలా ఉన్నా వీకెండ్ మూడు రోజులు భీబత్సం సృష్టిస్తోంది. నిన్నైతే దేశవ్యాప్తంగా చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు అయ్యాయి. సందీప్ వంగా తెలుగువాడు అవటంతో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫాస్ట్ అదిరిపోయాయి. ఇక ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి విషయం ఒకటి బయిటకు వచ్చింది.
అదేమిటంటే...‘యానిమల్’ నిడివి 3 గంటలా 21 నిమిషాలా 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్ ఇప్పటికే చాలా పెద్దదిగా చాలా మంది భావిస్తున్నారు. అయితే ఓటిటిలో మరో అరగంట కలిపి అంటే అన్ కట్ వెర్షన్ ని రిలీజ్ చేయటానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే దాదాపు నాలుగు గంటల సినిమా ఓటిటిలో ఉండనుందన్నమాట. అలాగే థియేటర్ లో వదలలేని కొన్ని షాట్స్, సీన్స్ ఓటిటిలో కనిపించనున్నారు. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ నెట్ఫ్లిక్స్లోకి రానుంది. కుదిరితే 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor),స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘యానిమల్’ (Animal). సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’కు సంబంధించిన రన్టైమ్ను దర్శకుడు సందీప్ వంగా షేర్ చేయగానే్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రన్ టైమ్ లెంగ్త్ చూసి, నెటిజన్లే కాదు, సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘‘యానిమల్’ నిడివి 3 గంటలా 21 నిమిషాలా 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్’’ అంటూ సందీప్ తెలిపారు. అయితే ఇక్కడే మరో షాకింగ్ విషయం రివీల్ అయ్యింది.
ఇక ఈ సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టడం వెనక కారణం చెప్పుకొచ్చారు. సందీప్ వంగా మాట్లాడుతూ... సాధారణంగా మనకి చదువు, తెలివితేటలు వచ్చాయి కాబట్టి మనిషి అని పేరు పెట్టుకున్నామని.. నిజానికి మనిషి ఒక సోషల్ యానిమల్ అని సందీప్ అన్నారు. మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించామని.. ఐక్యూ అనేది లేకపోతే మనం కూడా యానిమలే కదా అనేది తన వ్యక్తిగత భావన అని చెప్పారు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్నప్పటి నుంచీ అలాగే అనిపించేదన్నారు. ‘నేను ఆలోచించింది ఏంటంటే.. యానిమల్కు ఐక్యూ ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథకు యానిమల్ అనే టైటిల్ బాగుంటుందని ఆ పేరు పెట్టాను’ అని సందీ వివరించారు.
ఇక ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ...‘యానిమల్’ను తండ్రీకొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చని.. ప్రాథమిక కథ అదేనని చెప్పారు. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథలోని సారాంశమన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు ‘యానిమల్’లో రణ్బీర్ కపూర్ పాత్రకు ఉన్న పోలిక ఒక్కటేనని.. అది నిజాయితీ అని సందీప్ చెప్పారు. అర్జున్ రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేయలేమని.. కానీ ‘యానిమల్’లో హీరో పాత్రకు మాత్రం సామాన్యంగా అందరికీ ఉండే కోపమే ఉంటుందన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ రెండూ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలేనని తెలిపారు. అయితే కథ, పాత్ర చిత్రీకరణ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.
యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది.