కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్బీర్ కపూర్ క్లారిటీ
అలియా తన గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకున్నాడు రణ్బీర్ కపూర్. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కరోరా రాకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్ జరిగేదని వెల్లడించారు.
బాలీవుడ్లో క్రేజీ లవ్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది రణ్బీర్ కపూర్, అలియాభట్ అనే చెప్పాలి. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. డేటింగ్లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఈ జంటపై వార్తలే వినిపిస్తున్నాయి. అంత క్రేజీ లవ్కపుల్గా నిలిచారు. అయితే వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.
తాజాగా దీనిపై స్పందించారు రణ్బీర్ కపూర్. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అలియా తన గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ మాట్లాడుతూ, అలియాతో నా వివాహం ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కానీ లాక్ డౌన్ వల్ల ఆది వాయిదా పడింది. త్వరలోనే ఉంటుంది. దీనిపై ఇంకా ఎక్కువ వివరాలు తెలియజేయలేను` అని తెలిపారు. దీంతో ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. రణ్బీర్ చెప్పినదాన్ని ప్రకారం వచ్చే ఏడాది వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని చెప్పొచ్చు.
అయితే ఇప్పటికే ఇరుకుటుంబాల మధ్య రణ్బీర్, అలియా వివాహానికి సంబంధించిన చర్చ కూడా జరిగిందట. ఇరు కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ఇక మ్యారేజ్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమంటున్నారు. ఇక ఈ క్రేజీ లవ్ జోడీ ప్రస్తుతం కలిసి `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.