రానా నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనే.. ఇక `హిరణ్య కశ్యప`, `నేనే రాజు` సీక్వెల్ లేనట్టే?
రానా గతేడాది `విరాట పర్వం` చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత సినిమా ఏంటనే కన్ప్యూజన్ నెలకొంది. తాజాగా ఓ సరికొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
![rana daggubati next movie director final that both movies shelved? rana daggubati next movie director final that both movies shelved?](https://static-ai.asianetnews.com/images/01h7qw2ctsygkwejdhhjeqyras/rana-jpg_363x203xt.jpg)
రానా హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బిజీగా ఉంటున్నారు. అది కూడా చాలా సెలక్టీవ్గా ఉంటున్నాడు. చివరగా ఆయన `విరాటపర్వం` చిత్రంతో అలరించారు. ఈ మూవీ ఆడలేదు. ఈ సినిమా వచ్చి ఏడాది దాటింది. ఆ తర్వాత ఆయన్నుంచి సినిమా రాలేదు. మధ్యలో `హిరణ్యకశ్యప` ప్రకటించారు. త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై పెద్ద వివాదం జరిగింది. గుణశేఖర్ఈ ప్రాజెక్ట్ పై చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ట్రాక్లోకి రావడం పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు.
ఇక ఇప్పటి వరకు రానా హీరోగా సినిమాలు ప్రకటించలేదు. తాజాగా ఇద్దరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల `దయా` వెబ్ సిరీస్తో విజయాన్ని అందుకున్న దర్శకుడు పవన్ సాధినేనితో సినిమా చేయబోతున్నారట. ఇది చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. థ్రిల్లర్గా ఈ మూవీ ఉండబోతుందట. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందట.
మరోవైపు ఆర్కా మీడియాలోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయట. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగుందని, దానిపై వర్క్ జరుగుతుందని, ఇది స్క్రిప్ట్ ఫైనల్ అయితే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందట. ఇక నెక్ట్స్ రానా చేయబోయేది పవన్ సాధినేని ప్రాజెక్ట్ అని, ఆ తర్వాత ఆర్కా మీడియా లొ సినిమా ఉంటుందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక రానా.. నటించాల్సిన `హిరణ్య కశ్యప`ని పక్కన పెట్టారని తెలుస్తుంది. గుణశేఖర్ దీనిపై వివాదం చేయడంతో అంతా సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లేనట్టే అంటున్నారు. అంతేకాదు తేజ దర్శకత్వంలోనూ రానా సినిమా చేయాల్సింది. `నేనే రాజు నేనే మంత్రి`కి సీక్వెల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే పట్టాలెక్కాల్సింది. కానీ తేజ.. రానా తమ్ముడు అభిరామ్తో ఆ మధ్య ఓ సినిమా చేశాడు. ఇది ఘోర పరాజయం చెందింది. పాత కథ, హీరో సెట్ కాకపోవడంతో డిజాస్టర్ అయ్యింది. ఈ ఫలితం చూశాక `నేనే రాజు నేనే మంత్రి` సీక్వెల్ని కూడా పక్కన పెట్టారని సమాచారం. దీంతో వాటిని వదిలేసి రానా కొత్త కథలపై కూర్చుంటున్నారట. చాలా సెలక్టీవ్గా వెళ్తున్నారని సమాచారం.