తండ్రి కాదంటే తనయుడు ఓకే అన్నాడు.. చిరుత కాంబినేషన్ రిపీట్ !
చెర్రీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే అనే విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన `చిరుత` సినిమా రామ్చరణ్కి మంచి ఎంట్రీగా నిలిచింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దాదాపు 14ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని టాలీవుడ్ టాక్.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో దాన్ని పక్కన పెట్టారు చిరు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ లేనట్టే అన్నారు. ఇన్నాళ్ళకు తండ్రి కాదన్నా తనయుడు మెగా పవర్ స్టార్ ఓకే చెప్పాడట. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇది చిరుకి చెప్పిన స్క్రిప్టేనా? కొత్తదా అన్ని తెలియాల్సి ఉంది. బట్ ఈ కాంబినేషన్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇదిలా ఉంటే చెర్రీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే అనే విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన `చిరుత` సినిమా రామ్చరణ్కి మంచి ఎంట్రీగా నిలిచింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దాదాపు 14ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని టాలీవుడ్ టాక్. అంటే ఇది అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్ కానుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్చరణ్ `ఆర్ ఆర్ ఆర్` లో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్. ఈ భారీ బడ్జెట్ సినిమా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతుంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రధారులుగా, అలియాభట్, ఒలీవియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతోపాటు చిరు నటించిన `ఆచార్య`లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమా తర్వాత చెర్రీ ప్రాజెక్ట్ ఉంటుంది. అంతేకాదు `ఫైటర్` రిజల్ట్ పై ఆధారపడి కూడా ఉంటుంది.