మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన బిజినెస్‌ ఉమెన్‌గా, సామాజిక వేత్తగా, మెగజీన్‌ ఎడిటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. 

రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చుకుని ఇప్పుడు మరిన్ని పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు ఆయన భార్య ఉపాసన సైతం బిజినెస్‌ దూసుకుపోతుంది. ఆమె అపోలో ఆసుపత్రిలకు సంబంధించి వైస్‌ చెర్మైన్‌గా రాణిస్తుంది. ఈ క్రమంలో తన రంగంలో ఆమె అందిస్తున్న సేవాలకుగానూ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు. 

హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు 
సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆసుపత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా అన్నారు. 

గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె చెప్పారు. రామ్ చరణ్ `ఆర్ఆర్ఆర్` సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం.