Asianet News TeluguAsianet News Telugu

`గేమ్‌ ఛేంజర్‌`గా రామ్‌చరణ్‌.. శంకర్‌ మూవీ టైటిల్‌ ప్రకటన.. ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్‌..

మెగా ఫ్యాన్స్ కి బిగ్‌ ట్రీట్‌ ఇచ్చింది `ఆర్‌సీ15` టీమ్‌. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని ప్రకటించారు. ఊహించని టైటిల్‌ తో సర్‌ప్రైజ్‌ చేశారు.

ram charan movie title game changer announces surprising treat for mega fans arj
Author
First Published Mar 27, 2023, 8:33 AM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు రామ్‌చరణ్‌. ఈ సినిమాకి ఆస్కార్‌ రావడంతో ఆయన ఇమేజ్‌ మరింత పెరిగింది. దీనికితోడు ఆస్కార్‌ ప్రమోషన్స్ లో ఆయన మరింత యాక్టివ్‌గా వ్యవహరించడంతో ఇంటర్నేషనల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నారు. ఈ ఇమేజ్‌ ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాలపై ఉండబోతుంది. ఆయా చిత్రాలకు క్రేజ్‌ పెరుగుతుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌.. శంకర్‌ దర్శకత్వంలో `ఆర్‌సీ15` చిత్రంలో నటిస్తున్నారు. ఆస్కార్‌ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్‌ అమెరికాకి వెళ్లడంతో ఈ చిత్ర షూటింగ్‌కి కొంత గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అంతేకాదు షూటింగ్‌ సెట్‌లో చరణ్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలికి ఆయన్ని అభినందించారు. దీనికితోడు బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా రెండు రోజుల ముందే చేశారు. 

నేడు సోమవారం(మార్చి 27) చరణ్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో రామ్‌చరణ్‌ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్‌లో సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. చరణ్‌పై ఉన్న ప్రేమని చాటి చెప్పారు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రెండు అప్‌డేట్లు ఇవ్వబోతున్నట్టు ఆ ఈవెంట్‌లో దిల్‌రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. టైటిల్‌, రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇస్తామని వెల్లడించారు. తాజాగా మెగా ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. 

తాజాగా సోమవారం ఉదయం సినిమా టైటిల్‌ని ప్రకటించారు. టైటిల్‌కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి `గేమ్‌ ఛేంజర్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. `సర్కారోడు`, `సీఈవో` వంటి టైటిల్స్ ప్రచారంలో ఉండగా, తాజాగా ఊహించని టైటిల్‌ని ఖరారు చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రాజకీయ ఆటలో చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌గా మారబోతున్నారనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని, టైటిల్‌ ప్రకటనలో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అయితే రిలీజ్‌ డేట్‌పైక్లారిటీ ఇవ్వలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు మరో అప్‌డేట్‌లో ఆ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారట. ఆయన  రాకతో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతోపాటు ఆయన రాజకీయాలకు సంబంధించి గేమ్‌ ఛేంజర్‌గా ఉండబోతున్నారని తెలుస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios