పండగ మూడ్ లో చరణ్ దంపతులు... ఉపాసన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
చరణ్-ఉపాసన ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు. దసరా పండుగను ఇంట్లో కలిసి జరుపుకుంటున్నారు. చరణ్ తో తన దసరా వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఉపాసన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
రామ్ చరణ్ షూటింగ్ బ్రేక్ లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ఆర్సీ-15 చిత్రీకరణ తాత్కాలింగా ఆగిపోయింది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 చిత్రీకరణ తిరిగి ప్రారంభించడంతో చరణ్ మూవీ షూట్ ఆగిపోయింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీ వివాదాల కారణంగా ఆగిపోయింది. సెట్స్ లో ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరిగింది. అలాగే నిర్మాతకు దర్శకుడు శంకర్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భారతీయుడు 2 ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది.
ఇటీవల శంకర్ కి నిర్మాతలకు మధ్య సంధి కుదిరింది. దీంతో భారతీయుడు 2 మిగిలిన చిత్రీకరణ పూర్తి చేయడానికి శంకర్ ముందుకు వచ్చాడు. భారతీయుడు 2 నుండి శంకర్ బయటకు వచ్చే వరకు రామ్ చరణ్ వేచి చూడాల్సిందే. ఈ విరామ సమయాన్ని శంకర్ ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇటీవల సిస్టర్స్ శ్రీజా, సుస్మిత లను తీసుకుని ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు. బిజీగా ఉన్న ఉపాసన ఆ ట్రిప్ లో పాల్గొనలేకపోయారు.
అయితే దసరా పండుగను ఆమె భర్త చరణ్ తో కలిసి జరుపుకుంటున్నారు. నేడు ఆదివారం నేపథ్యంలో ఉపాసన సైతం ఇంట్లోనే ఉన్నారు. దీంతో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఉపాసన పండగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఉపాసన బ్లూ ట్రెండీ వేర్ ధరించగా... చరణ్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టారు. ఉపాసన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ కాగా ఫ్యాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.