శంకర్ని కలిసి రామ్చరణ్.. సీఎం పదవి ఖాయమైనట్టేనా?
చెర్రీ, దిల్రాజులకు దర్శకుడు శంకర్ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్చరణ్ ట్వీట్ చేశారు. ఆదివారం చాలా బాగా గడిచిందని తెలిపారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ని కలిశాడు రామ్చరణ్. నిర్మాత దిల్రాజుతో కలిసి ఆదివారం చెన్నైలో కలుసుకున్నారు. చెర్రీ, దిల్రాజులకు దర్శకుడు శంకర్ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్చరణ్ ట్వీట్ చేశారు. ఆదివారం చాలా బాగా గడిచిందని తెలిపారు. ట్వీట్లో ఆయన చెబుతూ, `నిన్న అద్భుతమైన రోజు. గ్రేట్ హోస్ట్ చేసినందుకు శంకర్ సర్, వారి ఫ్యామిలీకి ధన్యవాదాలు. #rc15 కోసం ఎదురుచూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలో రానుంది` అని ట్వీట్ చేశారు రామ్చరణ్.
రామ్చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా చిత్రానికి దిల్రాజు నిర్మాత. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అది 50వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాని గత కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ అప్పటికే శంకర్.. కమల్ హాసన్తో `ఇండియన్ 2` చేయాల్సి ఉంది. అది అనేక అవాంతరాల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమాని పక్కన పెట్టి దర్శకుడు శంకర్ తెలుగులో రామ్చరణ్తో ఓ సినిమా, హిందీలో రణ్వీర్ సింగ్తో `అపరిచితుడు` రీమేక్ని ప్రకటించారు.
దీన్నిసవాల్ చేస్తూ `ఇండియన్ 2` నిర్మాణ సంస్థ లైకా కోర్ట్ కెళ్లింది. తమ సినిమాని పూర్తి చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా ఆదేశించాలని లైకా కోర్ట్ ని కోరింది. అనేక వాదోపవాదనల అనంతరం ఈ కేసుని కోర్ట్ కొట్టేసింది. దర్శకుడు తనకిష్టం వచ్చిన సినిమా తీసుకొచ్చవని తెలిపింది. దీంతో సస్పెన్స్ నెలకొన్న రామ్చరణ్ సినిమాకి లైన్ క్లీయర్ అయ్యింది. ఈ నేపథ్యంలో రామ్చరణ్, దిల్రాజు ఆదివారం శంకర్ని కలవడం సినిమా పనులు ఊపందుకున్నాయనే సందేశాన్ని అందిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో చెర్రీ సీఎంగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా పట్టాలెక్కేందుకు అడ్డంకులు క్లీయర్ కావడంతో చెర్రీ ఇక సీఎం కావడం ఖాయమంటూ నెటిజన్లు ఫన్సీ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇందులో ఓ బలమైన పోలీస్ పాత్ర ఉందట. అందుకోసం ఓ బాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకుంటున్నారట. సల్మాన్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.