వంద కోట్లతో తెలుగులో మరో పాన్ ఇండియా సినిమా..
`రాక్షసుడు` సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. దీనికి సీక్వెల్ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.
సస్పెన్స్ థ్రిల్లర్గా `రాక్షసుడు` సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయాన్ని సాధించింది. బెల్లంకొండ స్థాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో వీరంతా హిట్ అందుకున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో `రాక్షసుడు` కి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. దీనికి సీక్వెల్ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఓ పెద్ద స్టార్ హీరో ఇందులో హీరోగా నటిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నిర్మాత కోనేరు సత్యనారాయణ చెబుతూ, ఈ సినిమాని వంద కోట్ల బడ్జెట్తో లావిష్గా, పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్నాయి. ఓ పెద్ద స్టార్ హీరో ఇందులో నటించబోతున్నారు. సరైన సమయంలో ఆ విషయాలను వెల్లడిస్తాం. మొదటి భాగం కంటే ఈ సినిమా మరింత ఉత్తేజకరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎక్కువ కమర్షియల్ అంశాలుంటాయి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది, త్వరలో లండన్లో ఈ చిత్ర షూటింగ్ని ప్రారంభిస్తాం` అని తెలిపారు.
`రాక్షసుడు` సినిమాని బాలీవుడ్లో రీమేక్ కోసం అక్షయ్ కుమార్ మమ్మల్ని సంప్రదించారు. ఆయన ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడని భావించాం. ఆయన కోరినట్టుగా పూజా ఫిల్మ్స్ కి బాలీవుడ్ రీమేక్ హక్కులను ఇవ్వడం జరిగింది. ఈ సినిమాతో రమేష్ వర్మ బాలీవుడ్లోకి అడుగపెట్టబోతున్నారు. రవితేజ `ఖిలాడీ` గురించి చెబుతూ, ఇది మా బ్యానర్లో మరో బ్లాక్బస్టర్ చిత్రమవుతుంది. ఈ సినిమా హక్కుల కోసం బాలీవుడ్ నుంచి కొంత మంది పెద్ద హీరోలు సంప్రదించారు. త్వరలో ఆ విషయాన్ని వెల్లడిస్తాం` అని చెప్పారు.అలాగే రాబోయే రోజుల్లో హవీష్(సత్యనారాయణ తనయుడు) నుంచి అత్యుత్తమ సినిమాలు చూస్తారని చెప్పారు.