బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అగ్ర దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది.
బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అగ్ర దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. 3 ఇడియట్స్, సంజు లాంటి పెద్ద పెద్ద సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హిరానీకి మంచి పేరుంది.
అగ్ర హీరోలు ఆయనతో కలిసి పని చేయాలని తాపత్రయ పడుతుంటారు. అటువంటి డైరెక్టర్ పై ఓ మహిళా సహాయక దర్శకురాలు లైంగిక ఆరోపణలు చేస్తోంది. 'సంజు' సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేసిన ఆమెపై పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో హిరానీ లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది.
ఈ ఘటన గురించి ఆమె 'సంజు' చిత్ర నిర్మాత విధూవినోద్ చోప్రాకి, హిరానీ భార్యకి ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. ఆ మెయిల్ లో ఏమని రాసుందంటే.. ''హిరానీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం అతడి వద్ద పని చేస్తున్న అసిస్టెంట్ ని.. నా పట్ల జరిగింది చాలా పెద్ద తప్పు. ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనని భయం. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగం మానలేక సైలెంట్గా ఉండిపోయాను'' అంటూ తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను హిరానీ ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది హిరానీపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, ఆయనపై కావాలనే ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2019, 10:25 AM IST