సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నారు.చాలా ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇళయరాజా పాల్గొనడం హైలైట్ గా నిలిచింది.

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని అగౌరవపరిచేలా కామెంట్స్ చేశారు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ పుష్ప 2 గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనితో రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడినా ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. తాజాగా రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 

చాలా ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇళయరాజా పాల్గొనడం హైలైట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇళయరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇళయరాజా మొదట తనకి సంగీతం అందించిన చిత్రం ప్రేమించు పెళ్లాడు. ఈ మూవీలో పాటలు బావున్నప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది. దీనితో నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను. 

ఆ వెంటనే ఇళయరాజా సంగీతంలో నటించిన మరో చిత్రం లేడీస్ ట్రైలర్. ఆ చిత్రం నా కెరీర్ నే మలుపు తిప్పింది. లేడీస్ ట్రైలర్ చిత్రం కనుక లేకుంటే నా ఫోటోకి ఇప్పటికే దండేసేవారు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. లేడీస్ ట్రైలర్ సినిమా హిట్ కాకుంటే చనిపోయేవాడిని. కానీ ఆ చిత్రం ఇప్పటికీ మీ ఇళ్లల్లో, మీ హృదయాల్లో ఉంది అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

ఆ సినిమా రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఏరా నువ్వు ఇంత బాగా నటించావు కదా.. ఇప్పుడు నా రీరికార్డింగ్ చూడు.. నీ నటన నెగ్గుతుందో.. నా రీరికార్డింగ్ నెగ్గుతుందో తేల్చుకుందాం అని ఆయన సవాల్ విసిరినట్లు రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.