Asianet News TeluguAsianet News Telugu

BIG BOSS5 RAJAMOULI: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది... రాజమౌళి షాకింగ్ కామెంట్స్

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిపోయిందంటూ.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అది ఎక్కడ అంటే.. బిగ్ బాస్ స్టేజ్ మీద. ఈరోజు (ఆదివారం) బిగ్ బాస్5  ఫైనల్స్ కు గెస్ట్ గా వచ్చిన జక్కన్న ఆ కామెంట్స్ చేశారు.

RAJAMOULI  SHOKING COMENTS ON RRR RELEASE
Author
Hyderabad, First Published Dec 19, 2021, 4:18 PM IST

బిగ్ బాస్ సీజర్ 5 ఫైనల్స్ కు వచ్చింది. ఈరోజు ( ఆదివారం) ఫైనల్ ప్రోగ్రామ్ ఈవినింగ్ టెలికాస్ట్ జరగబోతోంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి వదిలిన ప్రోమోలో సెలబ్రెటీ స్టార్స్ సందడి కనిపించింది. రాజమౌళి దగ్గర నుంచి రణ్ ధీర్ కపూర్, ఆలియా, రష్మిక, సుకుమార్, జగపతి బాబు, శ్రీయా.. ఇలియానా. ఇలా స్టార్స్ చాలా మంది సందడి చేసినట్టు ప్రోమోలో చూపించారు.

ఇక రాజమూళి స్టేజ్ మీద నుంచి సందడి చేశారు. హౌస్ మెంట్స్ తో చాలా సరదగా మాట్లాడారు. మీరు ఈ 100 రోజులు చాలా మిస్ అయ్యారు అంటూ జక్కన్న అనగా ట్రిపుల్ ఆర్ కూడా మిస్ అయ్యాము సార్ అంటూ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నారు. అప్పుడు జక్కన్న ట్రిపుల్ ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది అంటూ సరదా కామెంట్ చేశారు. దాంతో హౌస్ మెంట్స్ నిజమే అనుకుని షాక్ అయ్యారు. ఇటు నాగార్జున కూడా షాక్ అయ్యి రాజమౌళి వైపు చూశారు.

RRR PRE RELEASE: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ కు అంతా రెడీ.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

అటు 19 మంది కంటెస్టెంట్స్ తో 15 వారాలు నిర్విరామంగా .. సక్సెస్ ఫుల్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 5 నేటితో అయిపోతుంది. ఈ మూడు సీజన్లను కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. 19 హౌస్ మెంట్స్ లో వారానికి ఒకరు ఎమినేట్ అవుతూ... చివరికి సన్ని,సిరి,మానస్,శ్రీరామ్,షన్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా మిగిలారు. ఇందులో సన్నీ విన్నర్ అయినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ 25 లక్షల బ్యాగ్ తో బయటకు వచ్చినట్టు సమాచారం. రన్నర్ గా షన్ముఖ్ నిలిచినట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios